బ్రేకింగ్

breaking
26 Apr 2024 | 15:24 IST

బుగ్గన నామినేషన్‌ పెండింగ్‌.. వివరణ ఇవ్వాలన్న ఆర్వో

నంద్యాల: మరోసారి డోన్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నామినేషన్‌ పెండింగ్‌లో పడింది. ఆయన ఎన్నికల అఫిడవిట్‌పై తెదేపా అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఆస్తుల వివరాలు పూర్తిగా చూపించలేదని, నామినేషన్‌ పత్రంలో కొన్ని కాలమ్స్‌ భర్తీ చేయలేదని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వెంటనే నామినేషన్‌ తిరస్కరించాలని కోరారు. తెదేపా పిర్యాదుపై స్పందించిన ఆర్వో.. ప్రస్తుతం ఆయన నామినేషన్‌ను పెండింగ్‌లో ఉంచారు. సాయంత్రంలోగా ఆస్తుల వివరాలు ఇవ్వాలని బుగ్గన తరఫు న్యాయవాదికి నోటీసు ఇచ్చారు. 

మరిన్ని

తాజా వార్తలు