
నిర్మలమ్మ బడ్జెట్.. మళ్లీ నాలుగోసారి..!
భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే కట్టూ-బొట్టు.. ఆకట్టుకునే ఆహార్యం..
ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేని నిరాడంబరత్వం..
ఎవరితో అయినా సరే ఇట్టే కలిసిపోయే కలుపుగోలుతనం.. సౌమ్య స్వభావం..
వెరసి మనింట్లో అందరికీ తలలో నాలుకలా ఉండే ఓ పెద్దక్కయ్యలా కనిపిస్తారావిడ!
కేంద్ర బడ్జెట్ గురించి సర్వత్రా చర్చలు జరుగుతున్న వేళ.. ఇదంతా ఎవరి గురించో మీకు ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది..! అవును.. ఆవిడే మన కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్.
మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలను చేపట్టారు నిర్మలా సీతారామన్. ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళగా ఘనత సాధించారు. ప్రస్తుతం కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు బడ్జెట్ను ప్రకటించిన నిర్మలమ్మ.. తాజాగా నాలుగోసారి 2022-23 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కరోనా మూడో ఉద్ధృతి.. జీడీపీ.. ద్రవ్యోల్బణం.. ఇలా అనేక సవాళ్ల మధ్య ఈసారి నిర్మలమ్మ బడ్జెట్పై యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూసింది. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకోవడం సందర్భోచితం.
హస్తినలో కలిశారు!
నిర్మలా సీతారామన్ 1959, ఆగస్టు 18న తమిళనాడులోని మధురైలో సావిత్రి, నారాయణన్ సీతారామన్ దంపతులకు ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి రైల్వే ఉద్యోగి. ఇద్దరు ఆడపిల్లల్లో నిర్మల రెండో అమ్మాయి. మద్రాస్, తిరుచిరాపల్లిలో స్కూలింగ్ పూర్తిచేసిన ఆమె.. తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాలలో 'ఆర్ట్స్' విభాగంలో డిగ్రీ, దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో 'ఎకనామిక్స్' విభాగంలో పీజీ పూర్తిచేశారు. దిల్లీలో చదువుకునేటప్పుడే ఆంధ్రప్రదేశ్లోని నరసాపురంకు చెందిన పరకాల ప్రభాకర్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వారిద్దరూ వివాహం చేసుకున్నారు. అప్పటికే ఎకనామిక్స్ విభాగంలో పీహెచ్డీ చదువుతోన్న నిర్మల.. పెళ్లి తర్వాత తన భర్తకు 'లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్'లో స్కాలర్షిప్ రావడంతో తనతో కలిసి అక్కడికి వెళ్లిపోయారు. దాంతో ఆమె పీహెచ్డీ డిగ్రీకి మధ్యలోనే బ్రేక్ పడింది.
లండన్లో ఉన్నప్పుడు అక్కడి రెజెంట్ స్ట్రీట్లో ఓ గృహోపకరణాల స్టోర్లో సేల్స్ గర్ల్గా పనిచేశారు నిర్మల. ఆ తర్వాత యూకేలోని 'అగ్రికల్చరల్ ఇంజినీర్స్ అసోసియేషన్'లో ఒక ఆర్థికవేత్తకు అసిస్టెంట్గా వ్యవహరించారు. ఆపై 'ప్రైస్ వాటర్హౌస్' సంస్థలో సీనియర్ మేనేజర్గా విధులు నిర్వర్తించారు. ఆపై 'బీబీసీ వరల్డ్ సర్వీసెస్'లోనూ తనదైన ముద్రవేశారు నిర్మల. ఇక లండన్ నుంచి ఇండియాకి తిరిగొచ్చాక ఈ దంపతులకు వాజ్ఞ్మయి అనే పాప పుట్టింది.
'ప్రణవ'తో మొదలైంది..!
పుట్టింది సామాన్య కుటుంబంలోనే అయినా డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టారు నిర్మల. అత్తింట్లో అడుగుపెట్టిన అనతికాలంలోనే ఇక్కడి భాష, ఆచార వ్యవహారాలు ఒంటబట్టించుకొని, తన కలుపుగోలుతనంతో మెట్టినింటి వారి మనసు దోచుకున్నారామె. లండన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత హైదరాబాద్లో 'ప్రణవ' అనే పాఠశాలను స్థాపించారు. ఈ క్రమంలో అటు స్కూల్ బాధ్యతల్ని, ఇటు తల్లిదండ్రులు, అత్తింటి వారి బాధ్యతల్ని సమర్థంగా నెరవేరుస్తూ.. ఉత్తమ కోడలిగా, మంచి విద్యావేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఆమెలోని ఈ వర్క్-లైఫ్ బ్యాలన్స్, తెలివితేటలే ఆమెకు 'జాతీయ మహిళా కమిషన్'లో స్థానం కల్పించాయని చెప్పుకోవచ్చు.
'మహిళా కమిషన్'లో తనదైన ముద్ర!
'జాతీయ మహిళా కమిషన్'లో సభ్యురాలిగా కొత్త బాధ్యతల్ని భుజాలకెత్తుకున్న నిర్మల.. అక్కడా తనదైన దూకుడును ప్రదర్శించారు. అప్పట్లో సినిమా పరిశ్రమలోని సాంకేతిక విభాగం (టెక్నికల్ వింగ్)లో మహిళలు ఎదగడానికి అవకాశమే ఉండేది కాదు. అంటే.. సినిమాటోగ్రాఫర్గానో, మేకప్ ఆర్టిస్ట్గానో, ఎడిటర్గానో.. ఇలా వాళ్లు టెక్నికల్ పనులు చేయడానికి వీల్లేదన్నమాట. పురుషులు నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకుంటే అతణ్నుంచి సబ్-కాంట్రాక్ట్ తీసుకుని మాత్రమే మహిళలు పనిచేయాలి. అందువల్ల వీళ్లకి సగం పారితోషికం కూడా వచ్చేది కాదు. మహిళలకు సాంకేతిక నిపుణుల సంఘం వారు సభ్యత్వం ఇవ్వకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దేశం మొత్తం మీద నెలకొన్న ఇలాంటి పరిస్థితిలో కొందరు మహిళలు ఏకమై తమకూ సినీ ఇండస్ట్రీలోని 'టెక్నికల్ వింగ్'లో సభ్యత్వం కావాలంటూ జాతీయ మహిళా కమిషన్ తలుపుతట్టారు. ఆ తలుపుల్ని తెరిచింది నిర్మలే. అప్పుడే దీని అమలు కోసం ప్రత్యేక ప్యానల్ ఏర్పాటుచేశారామె. అయితే ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలోని పెద్దల దగ్గర్నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా అవన్నీ ఎదుర్కొని, పట్టుబట్టి మరీ మహిళలకు సభ్యత్వం ఇప్పించేదాకా నిర్మల కంటిమీద కునుకు లేకుండా పనిచేశారు. అలా మహిళా సాధికారతకు కృషి చేస్తూ తొలి విజయాన్ని అందుకున్నారామె.
కేవలం ఇదొక్కటే కాదు.. తాను వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కార్పొరేట్ వర్గాలతో ఎప్పుడు మాట్లాడినా 'బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్'లో స్త్రీల సంఖ్య పెరగాలనే చెబుతుండేవారు. అంతేకాదు.. తన శాఖ కింద ఉన్న ప్రభుత్వ పరిశ్రమల్లోనూ సమర్థులైన మహిళల్ని గుర్తించి.. వారికి కీలక బాధ్యతలు అప్పగించి తాను మహిళా పక్షపాతిననిపించుకున్నారు నిర్మల.
కార్యకర్త నుంచి ఆర్థిక మంత్రిగా..!
అప్పటికే పలు కీలక పదవుల్లో కొనసాగుతూ తనని తాను నిరూపించుకున్న నిర్మల.. 2008లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో సాధారణ కార్యకర్తగా చేరారు. మొదట పార్టీకి అధికార ప్రతినిధిగా సేవలందించిన ఆమె.. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ మంత్రివర్గంలో వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. అదే ఏడాది జూన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
2017లో అప్పుడు రక్షణమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ పదవి నిర్మలను వరించింది. అలా ఇందిరాగాంధీ తర్వాత రక్షణ మంత్రిగా పనిచేసిన రెండో మహిళగా నిర్మల నిలిచారు. అంతేకాదు.. రక్షణమంత్రిగా తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలో రఫేల్ కుంభకోణంపై ఆరోపణలు వస్తున్న సమయంలో ఆమె చూపిన నేర్పు బీజేపీ అగ్రనాయకత్వాన్ని మెప్పించిందని చెప్పుకోవచ్చు. ఇలా ఆమెలోని తెలివితేటలు, ఎలాంటి సమస్యల్నైనా ఎదుర్కొనే సమర్థత, ఓర్పు.. వంటి లక్షణాలే ఆమెకు మళ్లీ ఆర్థిక మంత్రిగా పదవిని కట్టబెట్టాయని చెప్పుకోవచ్చు.
కేంద్ర ఆర్థిక మంత్రి పదవి చేపట్టిన రెండో మహిళగా, పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా బాధ్యతలందుకున్న తొలి మహిళగా నిర్మల చరిత్రను తిరగరాశారు. గతంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు (1969, జులై 17 - 1970, జూన్ 27) దాదాపు ఏడాది పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసి.. ఈ మంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా నిలిచారు.
నిరాడంబరతకు నిలువెత్తు రూపం!
వికలాంగుల హక్కుల కోసం పోరాడే డాక్టర్ ఐశ్వర్యారావు అనే మహిళ తాము ఉపయోగించే పరికరాలపై జీఎస్టీ తగ్గించాలంటూ ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీని కలవడానికి ఓసారి ఆయన ఛాంబర్లోకి వెళ్లారు. వీల్ఛైర్లోనే లోపలికి వెళ్లిన ఆమెను అక్కడ ఎవరూ పట్టించుకోలేదు.. కానీ నిర్మల మాత్రం వెంటనే లేచి 'ఇలా రండి' అని ఆమెను తన వద్దకు పిలిచి.. తన సీటు ఖాళీ చేసి ఆమెకిచ్చారు. దాంతో ఆ పక్క సీట్లోనే ఉన్న అరుణ్జైట్లీతో మాట్లాడుతూ తన సమస్యల్ని చెప్పుకోగలిగారు ఐశ్వర్య. ఇలా ఒక కేంద్రమంత్రి స్థాయిలో ఉండి కూడా తన నిరాడంబరతను చాటుకున్నారు నిర్మల. ఆ తర్వాత ఐశ్వర్య 'ఓ కేంద్రమంత్రి నుంచి ఇలాంటి నిరాడంబరత నేను వూహించలేదు. ఆమె వల్లే జైట్లీతో ఎక్కువ సేపు మాట్లాడగలిగా..' అంటూ తన బ్లాగులో రాస్తూ నిర్మలకు ధన్యవాదాలు చెప్పుకున్నారు. నిర్మల ప్రజా పక్షపాతి అని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలదూ!
ట్రెక్కింగ్ అంటే ఇష్టం!
* అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులు, స్త్రీ-పురుష సమానత్వం పాటించే ఇంటి వాతావరణంలో పెరిగిన నిర్మల.. తనకు విశాల దృక్పథం అలవడడానికి బహుశా ఇలాంటి ఇంటి వాతావరణమే కారణమేమో అంటుంటారు.
* ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడడంతో పాటు ఏ విషయంపైనైనా అవలీలగా మాట్లాడగలిగే నేర్పు నిర్మల సొంతం.
* నిర్మలా సీతారామన్ అత్తింటి వారు కూడా రాజకీయ నాయకులే. ఆమె భర్త పరకాల ప్రభాకర్.. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. నిర్మల అత్తయ్య కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమె మామయ్య 1970లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు.
* తను ఓ పార్టీ.. భర్త ఓ పార్టీలో ఉన్న సమయంలో వ్యక్తిగత జీవితానికి, రాజకీయాలకు మధ్య స్పష్టమైన విభజన రేఖను గీసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు నిర్మల.
* అటు కుటుంబాన్ని, ఇటు వృత్తినీ బ్యాలన్స్ చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే ఈ తెలుగింటి కోడలికి ట్రావెలింగ్, ట్రెక్కింగ్, వంట చేయడం, సంగీతం వినడం అంటే చాలా ఇష్టమట!
* రోజూ ఉదయాన్నే లేచి దాదాపు రెండు గంటల పాటు పేపర్ చదవడానికి కేటాయిస్తారు నిర్మల. ఇక ఏ పనైనా తర్వాతేనట!
* నిర్మల కృష్ణుడి భక్తురాలు. ఆయన పాటలంటే చెవికోసుకుంటారు. ఓసారి ఆమె మైసూర్కి వెళ్తే అక్కడి కార్పొరేటర్ ఒకరు ఆమెకి శ్రీకృష్ణుడి దారు శిల్పం బహూకరించబోయారు. కానీ ఒకరి వద్ద నుంచి కానుకలు తీసుకునే అలవాటు లేని ఆమె.. 'ఇలా కానుకలివ్వడం మంచి అలవాటు కాదు.. మానుకోండి..' అని ముక్కుసూటిగా చెప్పారట. విలువలపై అంత నిబద్ధత ఆమెది!
* ఫోర్బ్స్ విడుదల చేసే ‘వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాలో రెండుసార్లు చోటు దక్కించుకున్నారు నిర్మల.
స్వదేశీ ట్యాబ్తో.. చేనేత చీరలో..!
* మోదీ హయాంలో నిర్మలమ్మ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడంలో కొత్త కొత్త సంప్రదాయాలు తెరపైకి వస్తున్నాయి. అంతకుముందు బడ్జెట్ కాపీలను లెదర్ సూట్కేసులో తీసుకువచ్చేవారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ విదేశీ సంప్రదాయానికి స్వస్తి పలికి.. రాజముద్ర ఉన్న ఎరుపు రంగు పద్దుల సంచీతో కనిపించడం విశేషం. ఇక, కరోనా నేపథ్యంలో- బడ్జెట్ను కూడా డిజిటల్ రూపంలోకి మార్చారు. రెండేళ్లుగా పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు నిర్మలమ్మ. ఈసారి నిర్మల స్వదేశీ ట్యాబ్లో చూస్తూ బడ్జెట్ ప్రసంగం చేశారు.
* స్వతహాగా చేనేత చీరలను ఇష్టపడే నిర్మల ఈసారి బడ్జెట్ సమావేశానికి ఒడిశా చేనేత చీర ధరించి వచ్చారు.
* నారీ శక్తికి ప్రాధాన్యమిచ్చే క్రమంలో - మహిళా, శిశు సంక్షేమ శాఖను పునర్ వ్యవస్థీకరించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, సాక్షం అంగన్వాడీ పోషణ్ 2.o వంటి పథకాలతో పాటు ఇంటింటికీ మంచినీటి సరఫరా పథకం విస్తరణ, చిన్న- మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ వంటివి అందిస్తాం.. వీటి కోసం రూ.౨ లక్షల కోట్ల ఆర్థిక నిధులు కేటాయిస్తాం' అని తెలిపారు నిర్మల.
కార్యదక్షత, సమర్థ నాయకత్వం, తెలివితేటలతో సమస్యల్ని ఎదుర్కొనే నైజం, చక్కటి వాక్చాతుర్యం.. మొదలైనవన్నీ నిర్మలకు పెట్టని ఆభరణాలు. తనదైన ప్రత్యేకతతో, ప్రతిభాపాటవాలతో అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన ఈ తెలుగింటి కోడలు నిర్మలమ్మ ఆసియాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ను తీర్చిదిద్దడంలో తనదైన ముద్ర వేస్తారని ఆశిద్దాం!
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని

వ్యాపారాన్ని సేవగా మలిచారు!
చిరువ్యాపారి అనూరాధ, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ నమ్రతా స్నేహితులు. పేద బాలికలు, వినికిడి లోపం ఉన్న అమ్మాయిలకు స్వయం ఉపాధి మార్గాన్ని చూపించాలనుకున్నారు. వీళ్లది చెన్నై. అనూరాధకు వంటలపై అమితాసక్తి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె భర్త ప్రవీణ్ చీజ్ తయారీ ఆలోచన చేయమని సూచించారు. అది నచ్చడంతో ప్రవీణ్ ఆఫీస్లోని చిన్న వంట గదిలో ప్రయోగాలు ప్రారంభించారు...తరువాయి

మా జట్టు.. వేలమంది మహిళలకు భరోసా!
సొంతంగా తమ కాళ్లమీద తాము నిలబడాలనుకొనే మహిళలకుఅనేక సందేహాలు వస్తుంటాయి. అలాంటప్పుడు వాళ్లు ఎవరితో మాట్లాడాలి? కాలేజీ రోజుల నుంచే ఆంత్రప్రెన్యూర్గా ఎదగాలని ఆశ పడే అమ్మాయి... తన కలని ఎలా నిజం చేసుకోగలదు? ఇలాంటివారికే కాదు సామాజిక మాధ్యమాల్లో వ్యాపారాన్ని విస్తరించాలనుకొనేతరువాయి

అమ్మా, అక్కా బూతులాపండి నాయనా!
బస్సుల్లో, ఆఫీసుల్లో... బహిరంగ స్థలాల్లో మగవాళ్లకి కోపం వస్తే ఒకరినొకరు తిట్టుకోరు. ఆ గొడవతో ఏమాత్రం సంబంధం లేని అమ్మని, అక్కని దూషిస్తారు. మనకీ ఇలాంటి సందర్భాలు లెక్కలేనన్ని ఎదురై ఉంటాయి. కానీ ఎప్పుడైనా వాటిని ఖండించే ప్రయత్నం చేశామా? ‘గాలీ బంద్ కర్ అభియాన్’ ఉద్యమం ఆ ప్రయత్నం చేస్తోంది..తరువాయి

Ashley Peldon : అరుస్తూ కోట్లు సంపాదిస్తోంది!
ఏదైనా హారర్ సినిమా చూసేటప్పుడు వచ్చే సన్నివేశాల కంటే.. దానికి నేపథ్యంగా వచ్చే అరుపులు, కేకలు మనల్ని మరింత భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. ఆ సన్నివేశాన్ని మరింత రియాల్టీగా ప్రేక్షకులకు చేరువ చేస్తాయి. హాలీవుడ్ సినిమాల బ్యాక్డ్రాప్లో వచ్చే ఇలాంటి అరుపులు.....తరువాయి

Tabassum Haque : వాళ్ల కోసమే ఈ అందాల పోటీలు!
మన నుదుటి రాత ఆ బ్రహ్మ రాస్తాడంటారు.. కానీ మన తలరాత మనమే రాసుకోవాలంటోంది దిల్లీకి చెందిన తబాసుమ్ హఖ్. ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన ఆమె.. చిన్నతనంలో చదువుకునేందుకు సరైన సదుపాయాలు లేక, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది. ఉన్నత విద్యతోనే ఈ పరిస్థితుల్ని....తరువాయి

Yoga Day : ఆ కట్టుబాట్లను దాటి సెలబ్రిటీ యోగా ట్రైనర్గా ఎదిగింది!
‘ఆడపిల్లవు.. ఒంటరిగా గడప దాటకు!’ అన్నారు ఇంట్లో వాళ్లు. కానీ ‘మెడిసిన్ చదవాలి.. ప్రజలకు సేవ చేయాలి..’ అనేది తన ఆశయం. అయితే తనది ఆధ్యాత్మిక కుటుంబం కావడంతో అనుకోకుండా ఓ యోగా విశ్వవిద్యాలయంలో చేరాల్సి వచ్చిందామె. అప్పటికీ యోగాపై......తరువాయి

ఆన్లైన్ యోగినులు!
ఇంటి పని పక్కనపెట్టి... ఉదయాన్నే జిమ్ము, జాగింగ్ అంటూ వ్యాయామాలు చేయగలిగే అవకాశం ఎంతమంది మహిళలకు ఉంటుంది? అలాగని నిర్లక్ష్యం చేస్తే థైరాయిడ్లు, పీసీఓడీలు! ఇలాంటి సమయంలో మీకు అండగా ఉంటాం అంటూ... నట్టింట్లోనే నేర్పేస్తున్నారీ ఆన్లైన్ యోగా గురువులు. తమ ఆరోగ్య పాఠాలతో దేశవిదేశాల్లో వేల మందికి మేలు చేస్తున్న ఆన్లైన్ యోగినుల గురించి చదవండి...తరువాయి

యూకేలో.. బామ్మ వంట హిట్
మంజూస్ రెస్టారెంట్కి వెళ్లారనుకోండి. ఎన్నో గుజరాతీ వంటకాలు మెనూలో కనిపిస్తాయ్. దానిలో కొత్తేముంది? ఏ గుజరాతీ రెస్టారెంట్కి వెళ్లినా ఇవే ఉంటాయ్.. అంటారా! అయితే అది ఉన్నది యూకేలో.. దాన్ని నిర్వహిస్తోంది.. 85 ఏళ్ల బామ్మ. ఆమె గురించి ఇంకా తెలుసుకోవాలనుందా? అయితే చదివేయండి....తరువాయి

వందల బాల్య వివాహాల్ని అడ్డుకున్నాం!
మన చుట్టూ ఎన్నో సామాజిక రుగ్మతలు కనిపిస్తాయి. అవన్నీ పరిష్కరించలేనివి కావు. కానీ మనకెందుకులే అనే నిర్లిప్తత. ఆమె మాత్రం అలా అనుకోలేదు. చేతనైనంతలో మార్పు తేవాలనుకున్నారు. దానికోసమే 30 ఏళ్లుగా కృషిచేస్తున్నారు. వందల బాల్య వివాహాల్ని అడ్డుకున్నారు, వేలమంది బాల కార్మికుల్ని బడిబాట పట్టించారు. సామాజిక మార్పు కోసం అలుపెరగక శ్రమి స్తున్న లలితమ్మ తన పోరాట పథాన్ని ‘వసుంధర’తో పంచుకున్నారిలా...తరువాయి

Heeraben Modi: ఆ విజయాల వెనుక కనిపించని సంతకం!
‘అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే!’ అంటుంటారు. తానెంత ఉన్నత హోదాలో ఉన్నా అమ్మ చాటు బిడ్డనే అంటున్నారు ప్రధాని మోదీ. ఆయన తల్లి హీరాబెన్ వందో పుట్టినరోజు సందర్భంగా.. ఆమె కాళ్లు కడిగి ఆశీర్వచనాలు తీసుకున్నారాయన. అంతేకాదు.. తనను ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు.......తరువాయి

టీచరమ్మకి అందాల కిరీటం
పెళ్లైయినంత మాత్రాన ఆశలకీ... లక్ష్యాలకీ దూరంగా ఉండాలని ఎవరన్నారు? అటు అందాల పోటీల్లోనూ.. ఇటు సేవామార్గంలోనూ చురుగ్గా ఉంటూ మిసెస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుందీ టీచరమ్మ...సర్గమ్ది గుజరాత్. ముంబయిలో స్థిరపడ్డారు. భర్త ఆది కౌశల్ భారత నౌకాదళ అధికారి. ఆయన వృత్తిరీత్యా విశాఖపట్నంలోనూ ఉన్నారు. ఇంగ్లిష్ లిటరేచర్లో పీజీ పూర్తి చేసిన ఈమె టీచర్గానూ పని..తరువాయి

మన కళలకు అంతర్జాతీయ ఖ్యాతి!
అంతర్జాతీయం అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేవి విదేశీ బ్రాండ్లే. కానీ ఆ ఆలోచనల్ని మార్చే ప్రయత్నం చేస్తోంది డిజైనర్ జ్యోతిదాస్. భారతీయ సంప్రదాయ కళల్ని స్ఫూర్తిగా తీసుకుని స్థానిక కళాకారుల చేత ఆభరణాలు, యాక్ససరీస్, దుస్తులు... తయారు చేయిస్తోంది. వాటిని ‘జ్యో షాప్’ బ్రాండ్తో దేశవిదేశాల్లో మార్కెట్ చేస్తోంది.తరువాయి

క్యాన్సర్ కబళిస్తోన్నా.. కలలు నెరవేర్చుకుంటోంది!
‘కష్టాలనే తలచుకుంటూ కూర్చుంటే జీవితంలో ఏమీ సాధించలేం.. అదే మన లక్ష్యాలపై దృష్టి పెడుతూ సాధించే ఒక్కో విజయం ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్నిస్తుంది..’ అంటోంది జర్మనీకి చెందిన స్విమ్మర్ ఎలేనా సెమెచిన్. ఓ అరుదైన సమస్య కారణంగా చిన్న వయసులోనే కంటి చూపుకి.....తరువాయి

ఈ అమ్మలు.. ప్రాణదాతలు!
మృత్యువు ముంగిట్లో ఉన్న వారిని బతికించే సంజీవని రక్తం.. ఆ సంజీవని క్షణం ఆలస్యం చేయకుండా అందించడంలో వీళ్లకు వీళ్లే సాటి. అర్ధరాత్రి తలుపుతట్టినా... మేమున్నాం అంటూ ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ప్రాణదాతలు వీళ్లంతా. నెలల పసిపాప... రక్తంలేక చనిపోవడం ఆమెని కలిచివేసింది. దాంతో రక్తదాన ఉద్యమకారిణి అయిపోయారు కావలికి చెందిన పార్వతి శంకర్. తాను 29 సార్లు రక్తదానం చేయడమే కాకుండా, తోటి మహిళల్లో చైతన్యం తెస్తూ వారితోనూ చేయిస్తున్నారు...తరువాయి

తీగపై సాహసాలతో...
ఎత్తు మడమల చెప్పులతో ఇబ్బంది పడకూడదని నిదానంగా నడుస్తారెవరైనా.. ఈమె మాత్రం వాటితో ఎంతో వేగంగా సన్నని తీగపై అలవోకగా అడుగు లేసేయగలదు. అంతలోనే గాలిలోకి ఎగిరి.. అదే వేగంతో తీగపై నిలబడగలదు. అబ్బురపరిచే ఈ సాహస కృత్యాలే తనకు రెండుసార్లు ప్రపంచ రికార్డు నిచ్చాయి. ఈమె రికార్డును గిన్నిస్ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తే కోట్ల మంది వీక్షించారు. ఆసక్తితో నేర్చుకున్న ఈ క్రీడ 40 ఏళ్ల ఓల్గాహెన్రీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ...తరువాయి

లక్షల మనసుల్ని గెలుస్తున్న అత్తాకోడళ్లు!
అత్తాకోడళ్లంటే ఎప్పుడూ తగాదాలూ, గిల్లికజ్జాలేనా?సరదాగా స్నేహితుల్లా, ప్రేమతో కలిసిపోతుంటే ఎంత బావుంటుంది! అలా కలిసుండటమే కాదు.. వాళ్ల అన్యోన్యతకు ప్రతిభను జోడించి లక్షలాది మంది అభిమానాన్నీ చూరగొంటున్నారు కొందరు... వాళ్లెవరో తెలుసుకోవాలనుందా? అయితే చదివేయండి.తరువాయి

తల్లులకు ఉద్యోగాలు చూపిస్తారు!
తల్లి అయ్యాక తిరిగి ఉద్యోగంలో కొనసాగేవాళ్లు దాదాపు సగం మందే. అనువైన పనివేళలు ఉంటే దాదాపు అందరు అమ్మలూ కెరియర్ని కొనసాగించేవారే. కానీ ఆ అవకాశం లేక పిల్లల కోసం కెరియర్ని త్యాగం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి కెరియర్, మాతృత్వం... రెండూ సాధ్యమయ్యేట్టు చేస్తున్నారు ఫ్లెక్సీబీస్ వ్యవస్థాపకులైన ముగ్గురు అమ్మలు.తరువాయి

ఆమె కుంచె పడితే.. నేరగాళ్లకు మూడినట్టే!
భవిష్యత్పై బోలెడు ఆశలతో ఉన్న అమ్మాయి. అనుకోకుండా అత్యాచారానికి గురైంది. తీవ్రమైన అవమాన భావన, ‘న్యాయం జరగకపోగా తననే తప్పంటే?’ అన్న భయం.. ఆ 20 ఏళ్ల అమ్మాయిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చనిపోవాలనుకునేది. అలా చేస్తే న్యాయం జరగదు. మరెలా? అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం వేలమందికి న్యాయం జరిగేలా చేసింది. ఎందరినో కటకటాల వెనక్కి వెళ్లేలా చేసింది.తరువాయి

యాసిడ్ నా ముఖాన్ని కాల్చగలిగిందేమో.. నా ఆశయాన్ని కాదు!
మగాళ్లు తప్పు చేసినా.. అందుకు ఆడవాళ్లే కారణం అంటుంది ఈ సమాజం! ఏ పాపం ఎరగకపోయినా వాళ్లనే నిందిస్తుంది. ఆమ్లదాడి బాధితులదీ ఇలాంటి పరిస్థితే! దాడి చేసిన వారిని పక్కన పెట్టి.. బాధితుల అందాన్నే విమర్శిస్తుంది.. అంద విహీనంగా ఉన్నారంటూ ఎగతాళి చేస్తుంది. కోల్కతాకు చెందిన సంచయితా జాదవ్ దే కూ ఇలాంటి....తరువాయి

Mithali Retirement: ఈ పరుగుల రాణికి సాటెవ్వరు?!
క్రికెట్ ఆడడానికే పుట్టిందేమో అన్నట్లుగా క్రికెట్నే తన జీవిత పరమావధిగా మార్చుకుందామె. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అందుకొని దేశానికే గర్వకారణంగా నిలిచింది. కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించడం, నాయకురాలిగా సహచరులకు నైపుణ్యాల్ని....తరువాయి

చదువు అయిదో తరగతి.. వ్యాపారం రూ.450 కోట్లు!
పల్లెటూరి అమ్మాయి.. కొత్త ప్రదేశానికి వెళ్లి.. అక్కడి భాష నేర్చుకొని వ్యాపారవేత్తగా ఎదిగింది. వినగానే సినిమా కథలా ఉంది కదూ! కానీ ఇది రత్నారెడ్డి జీవితం. అయిదో తరగతి చదివిన ఆమె వ్యాపారం ఇప్పుడు రూ.450 కోట్లు. అంతే కాదు... సంపాదనలో సగం సమాజానికంటూ విద్య, వైద్య పరంగా వేలమందికి సాయం చేస్తున్నారీ దయామూర్తి. సేంద్రియ వ్యవసాయం, యువతకు స్ఫూర్తి పాఠాలు.. చెప్పుకుంటూ పోతే ఆమె ఖాతాలో మరెన్నో!తరువాయి

CEO Radhika: అవును.. ఈ లోపం ఉన్నా సరే.. జీవితాన్ని గెలిచా!
లోపాలనేవి ప్రతి ఒక్కరిలో సహజం. అయితే వాటిని ప్రత్యేకతలుగా స్వీకరించినప్పుడే జీవితాన్ని గెలవగలం.. ‘ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్’ సంస్థ సీఈఓ రాధికా గుప్తా జీవిత కథ కూడా ఇందుకు మినహాయింపు కాదు. పుట్టుకతోనే మెడ కాస్త వంకరగా జన్మించిన ఆమె.. ఇటు స్కూల్లో, అటు సమాజం.....తరువాయి

పొదరిళ్లకు... అందాల సలహాదారులు!
దేశదేశాలు తిరిగినా, ప్రపంచాన్ని చుట్టినా.. ‘మన ఇల్లు’ అన్న భావనే వేరు. మనం మనలా ఉండే... అనుబంధాలను ఆత్మీయతలను పంచుకునే చోటది. అందుకే మన పొదరింటిని చక్కగా అమర్చుకోవాలని తాపత్రయ పడతాం. ఎప్పటికప్పుడు హంగులద్దుతుంటాం. లేకపోతే ఉన్నంతలోనే కొత్తదనాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటాం... సరిగ్గా ఇక్కడే మేమున్నామంటున్నారు ఇంటీరియర్ ఇన్ఫ్లుయెన్సర్లు. లక్షలమంది మనసుల్ని కొల్లగొడుతున్న వీరెవరో, ఏం చెబుతున్నారో చూడండి...తరువాయి

‘యూనికార్న్’ అంటే నమ్మలేకపోయా!
మహిళలు సాంకేతిక రంగంలో.. అదే విధంగా ఆర్థిక రంగంలో ఉండటం చూశాం. కానీ ఈ రెండూ కలగలసిన ఫిన్టెక్ రంగంలో మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఇదెంతో క్లిష్టమైన రంగం. అలాంటి చోట సత్తా చాటుతోంది మేబుల్ చాకో. అయిదు ఫిన్టెక్ కంపెనీలకు ఆమె సహ వ్యవస్థాపకురాలు. అంతేకాదు తను సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న ‘ఓపెన్తరువాయి

Sex Education: నాలా మరే చిన్నారీ బాధపడకూడదని..!
లైంగిక హింస.. పెద్దలే కాదు, పిల్లలూ దీని బారిన పడుతున్నారు. 18 ఏళ్లు దాటని బాలల్లో ఇద్దరిలో ఒకరు ఏదో ఒక రూపంలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలోనూ ఎక్కువ మంది తెలిసిన వారి చేతుల్లోనే హింసకు గురవుతున్నట్లు తేలింది. అందుకే చేతుల కాలాక ఆకులు.....తరువాయి

తెనాలి నుంచి క్యాన్సర్ని తరిమేయాలని...
మనదేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకీ ఒకరు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో చనిపోతున్నారని గణంకాలు చెబుతున్నాయి. వీటిలో 90 శాతం నివారించదగ్గవే. అందుకే ‘చికిత్సకంటే నివారణ మేలు’ అని నినదిస్తున్నారు తెనాలికి చెందిన డాక్టర్ శారద. అనడమే కాదు, ‘క్యాన్సర్ ఫ్రీ తెనాలి’ పేరుతో ఒక ఉద్యమాన్నే నడుపుతున్నారావిడ. దేశానికి ఒక నమూనాగా చూపాలనుకుంటున్న ఆ కార్యక్రమం గురించి ఆమె ఏం చెబుతున్నారంటే...తరువాయి

చేపల మార్కెట్లో కూలీ... కూతుర్ని డాక్టర్ చేసింది!
ఏ ఆదివారం పూటో చేపల మార్కెట్కి వెళ్తే... కాసేపు అక్కడ నిలబడ్డానికే ఇబ్బంది పడి ముక్కు మూసుకుంటాం. కానీ పాతికేళ్లుగా రమణమ్మకి ఆ మార్కెట్టే దేవాలయం. చేపల్ని శుభ్రం చేసినందుకు ఇచ్చే అయిదూ, పదే దైవంతో సమానం. ఎందుకంటే ఆ డబ్బుతోనే కూతుర్ని మెడిసిన్ చదివించింది. కొడుకుని క్యాన్సర్ నుంచి కాపాడుకుంటోంది... కూతురి కలను నెరవేర్చడం కోసం ఓ అమ్మ చేస్తున్న జీవన పోరాటం ఇది...తరువాయి

104 రోజులు... 104 మారథాన్లు!
క్యాన్సర్ కారణంగా ఆమె ఎడమ కాల్లో తొడ నుంచి కిందిభాగం తొలగించాల్సి వచ్చింది. అలాగని కుంగుబాటుకు గురి కాలేదామె. కాలికి బ్లేడ్ ధరించి, మారథాన్ పరుగుకు సిద్ధమైంది. రన్నర్గా ప్రపంచరికార్డును సాధించి.. లక్ష్యానికి వైకల్యం అడ్డుకాదని నిరూపించింది. 104 రోజుల్లో 104 మారథాన్లలో పరిగెత్తి తాజాగా గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది.తరువాయి

ఆ పిల్లల జీవితాల్లో ‘విద్యా’ కుసుమాలు పూయిస్తోంది!
చదువుకోవడం మన హక్కు.. కానీ పేదరికం కారణంగా చాలామంది పిల్లలు దీనికి దూరమవుతున్నారు.. చేసేది లేక బాల కార్మికులుగా వాళ్ల వయసుకు మించిన పనులు చేస్తూ బతుకీడుస్తున్నారు. మరికొంతమంది యాచకులుగా మారుతున్నారు. మురికివాడలు, రైల్వే స్టేషన్లలో ఇలాంటి చిన్నారులెంతోమంది....తరువాయి

Vitiligo Survivor: ఆ మచ్చలకు భయపడిపోలేదు.. భయపెట్టింది!
చర్మంపై చిన్న మచ్చ పడితేనే ఓర్చుకోలేం.. అలాంటిది మరికొన్ని రోజుల్లో చర్మం మొత్తం తెల్లగా, పాలిపోయినట్లుగా మారిపోతుందన్న చేదు నిజం తెలిస్తే.. ‘ఇక బతికేం ప్రయోజనం?!’ అంటూ కుమిలిపోతాం. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడినప్పుడే జీవితాన్ని.....తరువాయి

హిందీ నవల.. ఆంగ్ల పురస్కారం!
ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్.. ఆంగ్లంలో ప్రచురించిన నవలలు, కథాసంకలనాలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక పురస్కారం. దీనికి హిందీ రచయిత్రి గీతాంజలి శ్రీ రచన ‘రేత్ సమాధి’ ఎంపికైంది. ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలు తనే. తుది దశలో పోటీ పడినవారిలో ఎక్కువమంది మహిళలే! ఈ నవలా ఒక వృద్ధ మహిళ జీవితావలోకనం. అసలు హిందీ సాహిత్యానికి ఆంగ్ల పురస్కారమెలా అంటారా? ఇంకా చాలా విశేషాలున్నాయి...తరువాయి

Booker Prize : తల్లీకూతుళ్ల మధ్య సంఘర్షణే చదివించేసింది!
‘కథ అంటే ఏకబిగిన పాఠకులతో చదివించేలా ఉండాలి.. అంతటి రచనా సామర్థ్యం కలిగి ఉండడం నాకు ఆ భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం..’ అంటారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి శ్రీ. పెరిగి పెద్దయ్యే క్రమంలో రచనలంటే మక్కువ పెంచుకున్న ఆమె ఎన్నో కథలు, కాల్పనికాలు, నవలలు రచించి.. తనదైన రచనా శైలితో అశేషమైన.....తరువాయి

Domestic Abuse: అప్పుడు చనిపోవాలనుకుంది.. ఇప్పుడు పోలీసైంది!
సరిగ్గా ఆరేళ్ల క్రితం.. భర్త పెట్టే హింసను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని బావి దగ్గరికి వెళ్లిందామె. ఎందుకో కాళ్లు, చేతులు వణకడం మొదలైంది.. ఆ క్షణం తన ఏడాది కొడుకు, తల్లిదండ్రులు-తోబుట్టువులు, అష్టకష్టాలు పడి చదివిన డిగ్రీలు.. ఇవన్నీ కళ్ల ముందు....తరువాయి

ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే పర్వతాలు ఎక్కేస్తోంది!
కొంతమంది సౌకర్యవంతమైన జీవితం కోరుకుంటే.. మరికొందరు అడుగడుగునా సాహసాలతోనే సహవాసం చేస్తుంటారు. బెంగాల్కు చెందిన పియాలీ బసక్ రెండో కోవకు చెందుతుంది. పర్వతారోహణే తన ఆరోప్రాణంగా పెరిగిన ఆమె.. దాన్నే తన కెరీర్గా మలచుకుంది. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను, ఆర్థిక అడ్డంకు.....తరువాయి

బాల్య వివాహాన్ని తప్పించుకొని.. ‘గ్లోబల్ నర్స్’గా ఎదిగింది..!
కెన్యా అత్యంత పేద దేశాల్లో ఒకటి. అక్కడ విద్య, వైద్య సదుపాయాలు అంతంతమాత్రమే! అమ్మాయిలకు జననేంద్రియ విచ్ఛేదనం చేయడం అక్కడ ఆచారంగా భావిస్తారు. ఇక బాల్య వివాహాలు అక్కడ సర్వ సాధారణం. అమ్మాయిలకు 18 ఏళ్ల వయసులో పెళ్లి చేయడాన్ని చాలా ఆలస్యంగా భావిస్తుంటారు. స్త్రీ సాధికారత కొరవడిన ఇలాంటి ప్రాంతానికి....తరువాయి

ఈమె పండించిన వరి సువాసనభరితం..
లాల్ బస్నా ధాన్... ఇదో రకం ధాన్యం. దీనికో ప్రత్యేకత ఉంది. అదేంటంటే... ఇవి సువాసననిస్తాయి. దీనికున్న మరో విశిష్టతేంటంటే... దీన్ని ఓ మహిళా రైతు సృష్టించింది. వ్యవసాయంమీద ప్రేమతో సాగువైపు అడుగుపెట్టిన కాదంబిని... ఈ వంగడం రూపకర్త. అంతేకాదు, తోటి మహిళలకు సాగు నైపుణ్యాలూ నేర్పిస్తూ వారి ఆర్థిక ఉన్నతికి కృషి చేస్తోందీమె.తరువాయి

రక్తం ఇమ్మంటే.. పొమ్మనేవాళ్లు!
పెళ్లైన ఏడాదికే బాబు.. కానీ, మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే పిడుగులాంటి వార్త.. ‘బాబుకి తలసీమియా.. అయిదేళ్లకు మించి బతకడ’న్నారు. ఒక్కసారిగా కాళ్ల కింద భూమిని లాగేసినట్లు అనిపించిందామెకు. ఆ షాకు నుంచి తేరుకున్నాక, తన ఆయుష్షు పోసైనా పిల్లాణ్ని బతికించాలనుకుంది. అందుకోసం ఆమె ఎక్కని గడపలేదు, తిరగని ఆసుపత్రి లేదు. ఇప్పుడు తన బిడ్డలేకపోయినా, అలాంటి పిల్లలెందరికో ఊపిరినందిస్తున్నారు కొత్తపల్లి రత్నావళి. వసుంధరతో ఆ ప్రయాణాన్ని...తరువాయి

అలాంటప్పుడు గుండె మెలిపెట్టినట్టుంటుంది!
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యేనాటికి ‘కీవూ ఇండిపెండెంట్’ పత్రిక వయసు కేవలం రెండువారాలు. ప్రాణాలు దక్కితే చాలనుకుని అంతా ఉక్రెయిన్ ఖాళీ చేస్తుంటే.. కీవూ విలేకరుల బృందం మాత్రం ఈ రోజుకీ యుద్ధవార్తలని నిరాటంకంగా ప్రపంచానికి అందిస్తూ శభాష్ అనిపించుకుంటోంది. ఈ బృందానికి సారథ్యం వహిస్తున్న ఓల్గారుడెంకో తాజాగా టైమ్ ముఖ చిత్రమైంది..తరువాయి

చేతుల్లేకపోతేనేం... జీవితం ఉందిగా!
పొద్దున్నే లేచి తన పనులన్నీ చేసుకుంటుంది, ఇంటి పనులు చేస్తుంది, బొమ్మలూ వేస్తుంది. ‘చాలామంది చేస్తారుగా’ అంటారా... కానీ రెండు చేతులూ లేకుండానే ఇవన్నీ చేస్తుంది సారాటాల్బి. ఆమె ఓర్పు, నేర్పు చూసి కోట్లమంది స్ఫూర్తిపొందుతున్నారు... సారా చేతుల్లేకుండానే పుట్టింది. మొదట్నుంచీ చదువు మీదకన్నా ఎంతో కష్టమైన చిత్రకళపైన ఇష్టం పెంచుకుందీమె. ఆ ఇష్టంతో పెయింటింగ్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కాళ్లతోనే బొమ్మలు వేస్తూ తన ప్రతిభను...తరువాయి

ఆదివాసీ ఉత్పత్తులు ఆన్లైన్లో!
ఆమె పుట్టి పెరిగింది నగరాల్లో. ఉద్యోగం చేసింది దేశ రాజధాని దిల్లీలో. కానీ పల్లె జీవనమంటే ఆమెకెంతో ఇష్టం. దాంతో దిల్లీ వదిలి ఒడిశాలోని ఆదివాసీ గ్రామానికి మకాం మార్చింది 35 ఏళ్ల కావ్యా సక్సేనా. అక్కడి ఉత్పత్తుల్ని ప్రపంచానికి అందిస్తూ స్థానికుల జీవితాల్లో మార్పు తెస్తోంది!...తరువాయి

తన కథకు తనే హీరో!
‘నా కథలో నేనే హీరో కావాలి’ చిన్నప్పట్నుంచీ ఆమె ఆలోచనలు ఇలానే ఉండేవి. ఇప్పుడు ఆమె వయసు 58. ఆమె ప్రస్థానం గురించి తెలిసిన వాళ్లెవరైనా ఆమె ‘నిజమైన హీరో’ అని తప్పక చెబుతారు. మూడు దశాబ్దాల్లో నాలుగు విభిన్నమైన రంగాల్లో అడుగుపెట్టి అన్నింటా విజయం సాధించారామె. ఇప్పటికీ భవిష్యత్తు గురించి కలలు కంటారు. ‘జీవితం చిన్నదే దాన్ని మనమే పెద్దదిగా మలచుకోవాలి’ అని చెప్పే వంగ అరుణారెడ్డి ప్రస్థానం ప్రతి మహిళకూ స్ఫూర్తి పాఠమే...తరువాయి

యాభైఏళ్లుగా... ఒకటే మాట!
జీవనాధారం.. కుటుంబ విలువలు. వీటిల్లో ఏది ముఖ్యమో తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు రెండోదానికే ఓటేశారు ఛత్తీస్గఢ్లోని పాల్వాడి గ్రామమహిళలు. 50 ఏళ్ల క్రితం వాళ్లు తీసుకున్న ఆ నిర్ణయం వాళ్ల గ్రామాన్ని ప్రత్యేకంగా నిలిపింది.. ఛత్తీస్గఢ్లోని గిరిజన ప్రాంత పజల్లో అధికమంది విప్పపూలతో సారాయి తయారుచేసి దానిని విక్రయిస్తుంటారు. అదే వాళ్ల జీవనోపాధి కూడా. కానీ ధర్మపురి జిల్లాలో ఉన్న పాల్వాడి గ్రామం మాత్రం ఇందుకు...తరువాయి

పిల్లల కోసం క్యాన్సర్ని జయించింది!
‘ఆరు నెలలే.. అంతకు మించి బతకడం కష్టం’ అన్నారు వైద్యులు... ‘ఇలా బతికేకంటే ఏదైనా తిని చావొచ్చుగా’ అన్నారు ఇంట్లో వాళ్లు... ఇవన్నీ విన్నప్పుడు తనకంటే కూడా పిల్లల గురించే ఆందోళన చెందేది ఆ తల్లి. ‘ఎలాగైనా బతకాలి... వాళ్లకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి’ అనుకునేది. ఆ అమ్మ కోరిక ముందు అసాధ్యం సుసాధ్యమైంది. క్యాన్సర్తో సుదీర్ఘ పోరాటంలో ఆమె గెలిచి నిలిచింది.తరువాయి

స్కిప్పింగ్ రోప్తో లక్షలు సంపాదిస్తోంది!
ఎవరైనా ఉద్యోగం కోల్పోతే ఏం చేస్తాం.. మొదట్లో కొన్నాళ్లు ఇబ్బంది పడతాం.. పరిస్థితులు సద్దుమణిగాక కొత్త ఉద్యోగం వెతుక్కుంటాం. ఇంగ్లండ్లోని సెయింట్ ఆల్బన్స్కు చెందిన లారెన్ ఫ్లైమెన్ అలా చేయలేదు. కరోనా ప్రభావంతో తన జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి....తరువాయి

నీటి ఏటీఎంలతో... పేదల దాహార్తిని తీరుస్తోంది!
పేదవారికి అన్నం పెట్టడం, దుస్తులివ్వడం, చదువు చెప్పించడం లాంటివి అందరూ చేస్తారు. మరి అంతకంటే ఎక్కువ అవసరమైన నీటి విషయంలో ఎవరూ సాయం చేయరెందుకు? ఈ ప్రశ్నే చిన్మయీ ప్రవీణ్ని తొలిచేది. అందుకు ఆమె కనుక్కొన్న పరిష్కారమే మంచినీటి ఏటీఎంలు! కర్ణాటక వ్యాప్తంగా 900 నీటి ఏటీఎంలు ప్రారంభించి ప్రాణాధారమైన నీటిని అందరికీ అందిస్తున్నారు..తరువాయి

నిప్పుకు వెరవం... ముప్పుకు బెదరం
చుట్టూ...చెలరేగే మంటలు.. కూలిన కట్టడాలు.. వాటి మధ్య చిక్కుకున్న బాధితుల హాహాకారాలు మిన్నంటుతుంటే.. వారిని కాపాడేందుకు అగ్నిమాపకదళ సభ్యులు చేసే సాహసాలు ఒళ్లు గగుర్పొడుస్తాయి. అలాంటి ప్రమాదకర రంగంలోనూ.. మేము సైతం అంటున్నారీ సాహసులు. అగ్నిమాపకదళ దినోత్సవ సందర్భంగా ఈ వీరనారులపై ప్రత్యేక కథనం..తరువాయి

స్టార్ మహిళనన్నారు..
ఒక సామాన్యురాలు.. వందల మందిని నడిపించగలదంటే నమ్ముతారా? అరిపినేని పద్మావతిని చూస్తే నమ్మాల్సిందే! పుట్టింది చిన్న పల్లె.. చేతిలో డిగ్రీ లేదు.. కాలక్షేపానికి నేర్చుకున్న విద్యతో వందల మందికి ఉపాధి కల్పిస్తోంది... వ్యాపారాన్ని విదేశాలకూ విస్తరించింది. ఈ అసామాన్య మహిళ ప్రయాణం.. తన మాటల్లోనే..!తరువాయి

ఈ టిఫిన్ క్యారియర్లతో ఆ సమస్యలు ఉండవు!
సాధారణంగా ఏదైనా రెస్టరంట్కు వెళ్లినా, టిఫిన్ సెంటర్కు వెళ్లినా.. ఆహారాన్ని ప్యాక్ చేయడానికి సిల్వర్ ఫాయిల్ కవర్స్ ఎక్కువగా ఉపయోగించడం చూస్తుంటాం.. లేదంటే ప్లాస్టిక్ డబ్బాల్ని వినియోగిస్తుంటారు. నిజానికి ఈ రెండూ పర్యావరణహితమైనవి కావు. తద్వారా వాటిలో ప్యాక్ చేసిన ఆహారం తీసుకోవడం....తరువాయి

నగరాలను మార్చడమే నా లక్ష్యం!
చిన్నపుడు స్నేహితురాళ్లతో కలిసి స్వేచ్ఛగా వీధుల్లో ఆడుకునేది. సైకిల్ మీద బడికి వెళ్లొచ్చేది. కానీ ఆ నగరంలో పెరిగిపోయిన ట్రాఫిక్ ఆమె స్వేచ్ఛనూ, సరదాలనూ దూరం చేసింది. అందుకే ఆ అమ్మాయి అలాంటి వీధుల్నీ, నగరాల్నీ మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ డెవలప్మెంట్ పాలసీ (ఐటీడీపీ)’ దక్షిణాసియా డైరెక్టర్గా ఎదిగింది. తన లక్ష్య సాధనలో అశ్వతితరువాయి

పెట్టుడు కాలితోనే ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది!
‘కృషి ఉంటే మనుషులు రుషులవుతార’న్నట్లు.. ‘పట్టుదల ఉంటే వైకల్యాన్ని అధిగమించైనా విజయం సాధిస్తార’ని నిరూపిస్తోంది అరిజోనాకు చెందిన అల్ట్రా మారథానర్ జాకీ హంట్. క్యాన్సర్ కారణంగా ఎడమ కాలు మోకాలి కింది భాగాన్ని కోల్పోయిన ఆమె.. పట్టుదలతో పరుగును.....తరువాయి

Cannes Jury: దీపిక కంటే ముందు ఇంకెవరు?
కేన్స్ వంటి ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలో రెడ్ కార్పెట్పై అలా నడవడమే ఓ అదృష్టమనుకుంటారు చాలామంది తారలు. అలాంటిది ‘గోల్డెన్ పామ్’ వంటి మేటి అవార్డుకు ఎంపికయ్యే చిత్రమేదో నిర్ణయించే జ్యూరీలో భాగమయ్యే అవకాశం వస్తే..? తాజాగా అలాంటి అరుదైన అవకాశాన్ని తన సొంతం చేసుకుంది....తరువాయి

Happiness Gurukul: అలా సంతోషాన్ని పంచుతోంది!
సంతోషం కోసం మనం ఏవేవో మార్గాల్ని అన్వేషిస్తుంటాం. నచ్చిన పనులు చేయడం.. ఇష్టమైన వారితో గడపడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే ‘ఇలాంటి సంతోషం ఎక్కడో లేదు.. మనలోనే దాగుంద’ని చెబుతోంది ముంబయికి చెందిన శృతి మహేశ్వరి. వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లు, ఆందోళనలతో.....తరువాయి

పర్వత శిఖరాలతో ప్రేమలో పడ్డా...
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తర్వాత పర్వతాలతో ప్రేమలో పడింది... అదే ఆమెను మరిన్ని సాహసాలు చేసేలా పురిగొల్పింది. ప్రపంచంలో 18 ఏళ్లకే మౌంట్ సటోపంత్ ఎక్కిన యువతిగా చరిత్రకెక్కేలా చేసింది. తన ప్రసంగాలతో విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ.. కేఫ్నూ నిర్వహిస్తోంది. స్వీయ అనుభవాలను రచనగా మార్చి నేటితరానికి తన సాహసాలను వివరిస్తోంది.తరువాయి

Solar Warrior: కిరాణా కొట్టు నుంచి ఆ కంపెనీ సీఈఓగా ఎదిగింది!
‘మనసులో సాధించాలన్న తపన ఉంటే.. ఏదీ మనల్ని ఆపలేదు..’ అని నిరూపిస్తుంటారు కొందరు మహిళలు. రాజస్థాన్కు చెందిన రుకమ్నీ దేవి కటారా కూడా ఇందుకు మినహాయింపు కాదు. 13 ఏళ్లకే పెళ్లై, 16 ఏళ్లకే తల్లైన ఆమె.. గృహిణిగా ఇంటికే పరిమితమవ్వాలని కోరుకోలేదు. ‘వ్యాపారం నీకెందుకు? హాయిగా ఇంటిని చక్కదిద్దుతూ....తరువాయి

Neend App: కథలతో నిద్రపుచ్చే యాప్ని రూపొందించింది!
ఇలా పడుకోగానే అలా క్షణాల్లో నిద్రలోకి జారుకునే వాళ్లను చూసి.. ‘తనకంటే అదృష్టవంతులు లేరు!’ అనుకుంటాం. ప్రస్తుతమున్న జీవన విధానంలో సుఖ నిద్రకు అంత విలువ పెరిగిపోయింది మరి! వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలు చాలామందిని ప్రశాంతమైన నిద్రకు దూరం చేస్తున్నాయి. తద్వారా లేనిపోని అనారోగ్యాల....తరువాయి

ఫైవ్ స్టార్ హోటళ్లలో.. వీళ్ల చేతి మొఘలాయి రుచులు!
వారంతా చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కన్నారు. అయినా జీవితంలో ఏదో సాధించాలన్న తపన వారిని ఉన్న చోట ఉండనివ్వలేదు. కానీ వారి అత్తింటి వారు ఇందుకు ససేమిరా అన్నారు. ‘మీరు బయటికెళ్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు?’ అంటూ నిరుత్సాహపరిచారు. అయినా వారు వెనకడుగు వేయలేదు. అంతా ఒక్కచోట చేరి.. ఓ చిన్నసైజు వంటశాలను.......తరువాయి

Woloo App: ఒక్క క్లిక్తో పరిశుభ్రమైన టాయిలెట్ సౌకర్యం!
ఈ రోజుల్లో మహిళలకు ఇంటిని మించిన సౌకర్యమైన ప్రదేశం మరొకటి లేదని చెప్పచ్చు. ఎందుకంటే గడప దాటాక టాయిలెట్కు వెళ్లాల్సి వచ్చినా, పసి బిడ్డకు పాలు పట్టాల్సి వచ్చినా, ఉన్నట్లుండి సడెన్గా పిరియడ్స్ వచ్చినా.. మరో దారి లేక గమ్యస్థానం చేరే వరకూ ఎదురుచూడాల్సి వస్తోంది. ఒకవేళ దగ్గర్లో టాయిలెట్ సౌకర్యం......తరువాయి

ఆ పల్లెలు...ఈ అమ్మల చేతి రంగవల్లికలు
రాత్రికిరాత్రి ఏ ఊరూ ప్రగతి సాధించలేదు. అందుకోసం నాయకులు నిరంతరం అంకితభావంతో శ్రమించాలి. అన్నింటికీ మించి ప్రజల మద్దతు సంపాదించాలి. సర్పంచులుగా బ్లెస్సీ, సరోజన ఈ విషయంలో విజయం సాధించారు. ఓ అమ్మ తన ఇంటిని తీర్చిదిద్దినట్లే తమ గ్రామాల్ని తీర్చిదిద్ది.. జాతీయస్థాయిలో ఆదర్శంగా నిలబెట్టారు.తరువాయి

ఆర్థ్రైటిస్.. అయినా సరే అంటార్కిటికా యాత్ర పూర్తి చేసింది!
వృత్తి-ప్రవృత్తుల్లో సత్తా చాటే కొంతమంది మహిళలు.. తమ అరుదైన సాహసాలతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుంటారు. చరిత్రలో తమ పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంటారు. బెంగళూరుకు చెందిన అటవీ శాఖ అధికారిణి దీప్ జె కాంట్రాక్టర్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. భావి తరాల్లో పర్యావరణ స్పృహ పెంచే.....తరువాయి

స్విగ్గీకి దారి చూపిస్తోంది!
ఫుడ్ డెలివరీ వ్యాపారం అంటే... కాలంతో పోటీ. రెస్టరెంట్ నుంచి డెలివరీ పాయింట్కి సులువైన, దగ్గరి మార్గాన్ని ఎంచుకోవడంతోనే ఆ పోటీలో విజయం సాధ్యమయ్యేది. అందుకు మ్యాప్లు ఎంతో కీలకం. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి ఈ మ్యాప్లు రూపొందిస్తున్నారు ప్రజ్ఞ. ఈమె ఆ సంస్థ ఇంజినీరింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ కూడా.తరువాయి

బరువు తగ్గడానికెళ్లి.. ప్రపంచ ఛాంపియన్ అయ్యింది!
వివాహమై ఆమె ఓ బిడ్డకు తల్లైంది. ప్రసవం తర్వాత పెరిగిన అధిక బరువును తగ్గించుకోవడానికి జిమ్లో చేరింది. అదే ఆమెను అంతర్జాతీయస్థాయి క్రీడాకారిణిగా మార్చింది. కెటిల్బెల్ క్రీడలో స్వర్ణపతకాన్ని సాధించిన తొలి మహిళగా, ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ప్రధాని ప్రశంసలను సైతం అందుకుంది. ఆమెనే 40 ఏళ్ల శివానీ అగర్వాల్. ఆమె స్ఫూర్తి కథనమిదీ..తరువాయి

ఆ కష్టం మేం దాటాం
మాతృత్వం గొప్ప అనుభూతి!.. దాన్ని ఆస్వాదించే సమయంలో కొన్ని సమస్యలూ ఎదురవుతాయి.. వాటిని ఎలా అధిగమించాలో తెలియక... ఎవరితో చెప్పుకోవాలో అర్థంకాక కొత్తగా తల్లైనవాళ్లు సతమతమవుతుంటారు. బేబీ బ్లూస్ లేదా ప్రసవానంతర కుంగుబాటుని ఎదుర్కొన్న కొంతమంది సెలబ్రిటీలు దాన్ని ఎలా అధిగమించారో చెప్పుకొచ్చారు...తరువాయి

Alia-Ranbir Wedding : ఆలియా చీరకట్టు వెనుక ఆమె!
తమ పెళ్లికి ఖరీదైన చీరలు, లెహెంగాలు ఎంచుకోవడమే కాదు.. వాటిని కట్టే విధానంలోనూ వైవిధ్యం చూపించడానికి ఆరాటపడుతున్నారు ఈతరం అమ్మాయిలు. కొత్త పెళ్లి కూతురు ఆలియా భట్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తన ఫ్యాషన్ సెన్స్ని, భారతీయ సంప్రదాయాన్ని రంగరించి తాను ఎంచుకున్న బ్రైడల్ చీరలో ఏంజెల్లా.....తరువాయి

చీకట్లో... సితార!
బ్రెయిన్ఫీవర్ ఆమె జీవితంలో చీకట్లని నింపాలని చూస్తే... ఆ కష్టాన్ని.. సంగీతంతో జయించి మనసులో వెలుగులు నింపుకొందామె! అంధత్వం తనని వెనక్కి లాగాలని ప్రయత్నించినప్పుడు... ఉద్యోగంలో ఎన్నో మెట్లు ఎక్కి ముందుకే వెళ్లింది! ఓవైపు సితార్ విద్వాంసురాలిగా, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగినిగా జీవితాన్ని సమన్వయం చేసుకుంటూతరువాయి

Microsoft India COO: జీవితం పిజ్జా లాంటిది.. ఆ ఐదూ ఉండాల్సిందే!
‘జీవితంలో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే!’ చాలామంది ప్రముఖులు ఆచరించే విజయసూత్రమిది. తన సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే అంటున్నారు మైక్రోసాఫ్ట్ ఇండియా సీఓఓగా తాజాగా నియమితురాలైన ఇరీనా ఘోస్. రెండు దశాబ్దాలుగా ఈ సంస్థలో ఎన్నో కీలక పదవులు అధిరోహించిన ఆమె.. ఓ సమాజ సేవకురాలు కూడా! చదువే అమ్మాయిల్ని.....తరువాయి

సిగ తరిగిపోతుంటే!
జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందమనేది తరతరాల నానుడి. కానీ ఆ జుట్టే రాలుతోంటే మనకు ఎక్కడలేని బెంగ. కారణాలు వెతికేస్తుంటాం, తెలిసినవన్నీ ప్రయత్నిస్తుంటాం. ఇటీవల ఆస్కార్ వేడుకల్లో విల్స్మిత్ భార్య జాడా పింకెట్ గుండు విషయంలో వివాదం గుర్తుందిగా! ఆమెది ఫ్యాషన్ కాదు.. అలోపేసియా ఏరియేటా అని తెలిశాక దీని బారిన మేమూ పడ్డామంటూ ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ బయటకు రావడం మొదలైంది. దీంతో తమదీ అదే సమస్యేమోనని నెట్టింట...తరువాయి

Water Warrior: మురుగు నీటిని మంచి నీరుగా మారుస్తోంది!
నిత్యావసరాలు, ఇతర పనుల రీత్యా రోజూ లీటర్ల కొద్దీ నీటిని వృథా చేస్తుంటాం.. కానీ ఇదే సమయంలో నీటి కరువు తాండవించే ప్రాంతాల గురించి ఆలోచించం..! ఇదిలాగే కొనసాగితే తర్వాతి తరాలకు ప్రతి నీటి బొట్టూ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని గణాంకాలు......తరువాయి

కేంద్రం మెచ్చిన పరిశోధనామణులు!
ఎన్నో సమస్యలు... మరెన్నో సవాళ్లు అవి మనల్ని వెనక్కిలాగుతుంటే పరిష్కారాల్ని ఆలోచించి మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఎంతోమంది శాస్త్రవేత్తలు. వారిలో 50 ఏళ్లలోపున్న 75 మంది మేటి శాస్త్రవేత్తల్ని కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం గుర్తించి గౌరవించింది. వారిలో స్థానం దక్కించుకున్నారు విద్య, సోనా... తల్లిని కోల్పోయి అనాథగా మిగిలిన ఏనుగు పిల్లని ఆడ ఏనుగులు అలాగే వదిలేయవు. తమ గుంపులోకి ఆహ్వానించి దాన్ని అక్కున చేర్చుకుంటాయి. కానీ ఇలా చేయడం మగ ఏనుగులకి సుతరామూ నచ్చదు.తరువాయి

‘రాయల్ సొసైటీ’లో మన శాస్త్రవేత్త
‘రాయల్ సొసైటీ ఆఫ్ లండన్’లో ఫెలోషిప్ సాధించడమంటే శాస్త్రవేత్తగా ప్రపంచస్థాయి గుర్తింపు లభించినట్లే. అలాంటి అరుదైన గుర్తింపుని సంపాదించారు దిల్లీకి చెందిన రసాయన శాస్త్రవేత్త డా. బిమ్లేష్ లోచబ్. 360 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సొసైటీలో స్థానం సంపాదించిన రెండో భారతీయ మహిళ ఈమె. ఇంతటి గొప్ప గౌరవం పొందడం ఆమెకు ఎలా సాధ్యమైందంటే...తరువాయి

Booker Prize Nominations: తల్లీకూతుళ్ల మధ్య సంఘర్షణే చదివించేసింది!
‘కథ అంటే ఏకబిగిన పాఠకులతో చదివించేలా ఉండాలి.. అంతటి రచనా సామర్థ్యం కలిగి ఉండడం నాకు ఆ భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం..’ అంటారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి శ్రీ. పెరిగి పెద్దయ్యే క్రమంలో రచనలంటే మక్కువ పెంచుకున్న ఆమె ఎన్నో కథలు, కాల్పనికాలు, నవలలు రచించి.. తనదైన రచనా శైలితో అశేషమైన పాఠకాభిమానుల్ని....తరువాయి

ఈమె కడితే... ఐక్యరాజ్యసమితి మెచ్చుకుంది
ఆకాశాన్ని తాకే భవనాలు అభివృద్ధి సూచికల్లా అనిపించొచ్చు.. కానీ వాటి నిర్మాణంలో వాడే పదార్థాల వల్ల జరిగే కాలుష్యం పర్యావరణాన్ని వినాశం దిశగా నడిపిస్తోందంటున్నారు తృప్తి దోషి. ఇందుకు పరిష్కారంగా ఆమె ఎంచుకున్న మార్గం, నిర్మించిన భవనాలు ఆధునిక తరం ఆర్కిటెక్ట్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి...తరువాయి

జర్మనీ నుంచి.. ఆ పిల్లల కోసం వచ్చేశా!
ఆధ్యాత్మిక పయనానికి భారత్లో అడుగుపెట్టినా... అనుకోకుండా సేవా మార్గాన్ని ఎంచుకున్నారు. దానికోసం జన్మభూమినీ, తల్లిదండ్రుల్నీ వదిలి... వేల కిలోమీటర్ల దూరంలోని తెలుగు నేలమీద స్థిరపడ్డారు. వందల మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారుతరువాయి

Sufiya Sufi : 6002 కిలోమీటర్లు.. 110 రోజులు.. ఓ గిన్నిస్ రికార్డు!
కాస్త దూరం పరిగెడితేనే అలసిపోతాం.. కాళ్లు నొప్పులు పుడుతున్నాయంటూ ఆపసోపాలు పడుతుంటాం.. కానీ అజ్మీర్కు చెందిన సూఫియా ఖాన్ మాత్రం ఏకధాటిగా రోజుల తరబడి పరిగెడుతూనే ఉంటుంది. కొండ-కోనలు, రాళ్లూ-రప్పలు, మంచు పర్వతాలు, మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలు.. ఇవన్నీ దాటుకుంటూ ఇప్పటికే దేశాన్ని......తరువాయి

వయసు 83.. సైక్లింగ్, స్కిప్పింగ్, పుషప్స్.. ఏదైనా చేసేస్తా!
ఫిట్నెస్.. ఇది ఒక వయసుకే పరిమితమనుకుంటాం.. ఆ వయసులోనైతేనే విభిన్న వ్యాయామాలు చేయడానికి శరీరం సహకరిస్తుందనుకుంటాం. కానీ ఇదే ప్రశ్న ఫిట్నెస్ ఫ్రీక్ మిలింద్ సోమన్ తల్లి ఉషా సోమన్ని అడిగితే ‘ఫిట్నెస్కి వయసుతో సంబంధమేముంది? దానిపై మనసు పెడితే చాలు.. ఏ వయసులోనైనా దీన్ని మన సొంతం....తరువాయి

Jada Pinkett : ప్రేయసిగా నటించమంటే భార్యగా మారింది!
మన ప్రాణానికి ప్రాణమైన వారిని పల్లెత్తు మాటన్నా మనం ఊరుకోం. అలాంటిది కట్టుకున్న భార్యను కళ్లెదుటే హాస్యాస్పదంగా మాట్లాడుతుంటే.. ఆ ఆవేశంలో వాళ్లను ఓ చెంప దెబ్బ కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేడుకల్లో తొలిసారి ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఉత్తమ నటుడిగా ఎంపికైన విల్ స్మిత్ భార్య జాడాతరువాయి

Cancer Survivor: విమానాల్ని అద్దెకిస్తూ కోట్లు గడిస్తోంది!
‘కల అంటే నిద్రలో వచ్చేది కాదు.. నిద్ర పోనివ్వకుండా చేసేది’ అన్నారు అబ్దుల్ కలాం. విమానయాన రంగంలోకి రావాలన్న కల తననూ పట్టు వదలని విక్రమార్కుడిలా తయారుచేసిందంటోంది జెట్ సెట్ గో సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ కనికా టేక్రివాల్. పురుషాధిపత్యం వేళ్లూనుకుపోయిన విమానయాన రంగంలోకి అడుగుపెట్టాలని.....తరువాయి

రైతుల జట్టు... ఆలోచన హిట్టు!
ఆరుగాలం శ్రమించినా పంట చేతికి వస్తుందన్న హామీ లేదు. అదృష్టం బావుండి పండినా, దళారుల రూపంలో దురదృష్టం వెనకే ఉండేది. దాంతో ఆ గ్రామాల్లోని రైతులు ఒక్కొక్కరే కూలీలుగా మారడంతో ఆమె మనసు తరుక్కుపోయింది. ‘రైతులందరం జట్టు కట్టి కొత్తదారిలో నడుద్దాం’ అని పిలుపునిచ్చింది. అన్నదాతలంతా మళ్లీ ధైర్యంగా కాడి పట్టేందుకు శాంతి ఏం చేస్తున్నారంటే...తరువాయి

Mrs India Universe : రెండు దశాబ్దాల కల అలా నెరవేర్చుకుంది!
పెళ్లి, పిల్లలు, ఇంటి బాధ్యతలు.. వీటి కారణంగా చాలామంది మహిళలు తమకు ఇష్టం ఉన్నా, లేకపోయినా కెరీర్ను మధ్యలోనే ఆపేయాల్సి వస్తోంది. అయితే కొంతమంది ఆలస్యంగానైనా తమ అభిరుచులకు పదును పెడుతుంటారు. జీవితంలో తాము కన్న కలల్ని నెరవేర్చుకుంటారు. అమృత్సర్కు చెందిన శ్వేతా దడా ఇదే కోవలోకి చెందుతారు. 19 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన ఆమెకు ఫ్యాషన్ ప్రపంచంలోకి....తరువాయి

72.. అయితేనేం.. క్రేన్లు, ప్రొక్లెయినర్లు.. ఏదైనా నడిపేస్తా!
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా మహిళలు ఏదైనా వాహనాన్ని నడిపితే వింతగా చూస్తుంటారు. అందులోనూ బస్సు, ట్రక్కు, లారీ.. వంటి భారీ వాహనాలను నడిపితే అదొక సంచలనమే. అలాంటిది కేరళకు చెందిన రాధామణి (72) ముప్పై ఏళ్ల క్రితమే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు. అంతేకాదు ఆ తర్వాత బస్సు, లారీ, ట్రక్కులతో పాటు క్రేన్లు, రోడ్ రోలర్లు.....తరువాయి

ఈ రిపోర్టర్ మధ్యలోనే టెలికాస్ట్ ఎందుకు ఆపిందో తెలుసా..?
ప్రపంచమంతటా రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న సైనిక చర్య గురించే చర్చ జరుగుతోంది. అందమైన దేశంగా పేరుగాంచిన ఉక్రెయిన్.. ఇప్పుడు బాంబుల చప్పుళ్లు, మిస్సైళ్ల మోతలతో అట్టుడుకిపోతోంది. అణు రియాక్టర్ దగ్గర మంటలు, ప్రసూతి ఆసుపత్రిపై మిస్సైల్ దాడి, జీవాయుధ ల్యాబ్ల నుంచి హానికరమైన.....తరువాయి

నా కోసం అమ్మ ఎన్నో అవమానాలు భరించింది...
ఆమె శరీరంలో విరగని ఎముకంటూ లేదు. 20 ఏళ్లుగా మంచానికే పరిమితమైనా.. ఆమె చదువులో సరస్వతి. కదిలే చేతులతోనే 3డీ విజువలైజేషన్లో పట్టు సాధించి కన్సల్టెంట్గా పని చేస్తోంది. మన కోసమే కాదు, ఇతర ప్రాణుల కోసం కూడా జీవించేదే అసలైన జీవితం అని చెప్పే 34 ఏళ్ల ఆస్తా మౌర్య నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినదెంతో ఉంది..తరువాయి

ఆ అరుదైన కోవలో మనం ఉండాలి!
‘మహిళలు అందిపుచ్చుకోవాలే గానీ.. ఈ రోజుల్లో వారికోసం బోలెడన్ని అవకాశాలు, ఉన్నత స్థానాలు ఎదురుచూస్తున్నాయి’ అంటున్నారు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఉప కులపతి నజ్మా అఖ్తర్. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీగా మూడేళ్ల క్రితం బాధ్యతలు అందుకున్న ఆమె.. ఈ విద్యా సంస్థను కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనే..తరువాయి

ప్రభుత్వోద్యోగం వదిలి రాజకీయాల వైపు..!
ఆమె ఓ ప్రభుత్వాసుపత్రిలో నేత్ర వైద్యురాలిగా పనిచేస్తోంది.. సురక్షితమైన ఉద్యోగం.. నెల తిరిగే సరికి వేలకొద్దీ జీతం.. అయినా ఈ సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలన్న తపన ఆమెను వెంటాడేది. అందుకు రాజకీయాలే సరైన వారధి అని భావించి.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇటువైపుగా అడుగులేసింది. ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ప్రత్యర్థిని చిత్తు చేసి....తరువాయి

Ukraine Russia War : నేలకొరిగిన ‘మదర్ హీరోయిన్’!
పిల్లల్ని కోల్పోయిన తల్లులు, తల్లుల్ని పోగొట్టుకున్న పిల్లలు, భర్తల్ని దూరం చేసుకున్న భార్యలు, చంకన బిడ్డనెత్తుకొని - ప్రాణాలరచేత పట్టుకొని గమ్యం లేని ప్రయాణం చేస్తోన్న మహిళలు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో మనసుల్ని మెలిపెడుతోన్న ఇలాంటి ఘటనలెన్నో! మరోవైపు మాతృ దేశం కోసం ఎంతోమంది మహిళలూ భయమెరుగక యుద్ధ రంగంలోకి దూకి తమ ప్రాణాల్నే పణంగా.....తరువాయి

Nykaa: ఆ జాబితాలో బిలియనీర్.. ఫల్గుణీ నాయర్..!
‘మనలోని తపనేంటో తెలుసుకుంటే సరిపోదు.. దాని పైనే ప్రాణం పెట్టాలి.. సవాళ్లకు వెరవకుండా ముందుకు సాగాలి.. అప్పుడే విజయం వరిస్తుంది’ అంటారు ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్. బ్యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె.. యాభై ఏళ్ల వయసులో తన తపనేంటో తెలుసుకున్నారు. మేకప్ను అమితంగా ఇష్టపడే ఆమె.....తరువాయి

మా రేడియో ఆడవాళ్ల కోసం!
పన్నెండేళ్లకే పెళ్లి... ఆ వెంటనే ఇంటి బాధ్యతలు మీదపడ్డాయి. తనలా మరో ఆడపిల్ల ఇబ్బంది పడకూడదని గజ్జెకట్టి, పాటపాడి దేశమంతా తిరిగి ఆడపిల్లల్లో చైతన్యం తీసుకొచ్చారు. వేలమంది స్త్రీలని స్వయం ఉపాధి బాట పట్టించారు. తాజాగా ‘ఆవాజ్ వనపర్తి’ అంటూ రేడియో వేదికగా మరింత మంది స్త్రీలకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు వనపర్తికి చెందిన కమర్ రెహమాన్..తరువాయి

లక్షల మందికి మానసిక సేవ
‘శరీరానికి జబ్బు చేస్తే వైద్యుణ్ని కలుస్తాం, చికిత్స తీసుకుంటాం. మానసిక సమస్యలూ అలాంటివే! వాటికీ సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి’ అంటారు డాక్టర్ తారా రంగస్వామి. ఈ అంశంపై పరిశోధనలు చేయడమే కాదు.. ప్రజల్లో అవగాహనా కల్పిస్తున్నారీమె. బాధితులకు న్యాయం జరిగేలా చట్టంలో మార్పులొచ్చేలా చేశారు. లక్షల మందికి ఆవిడ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు.తరువాయి

Radhe Shyam: వింటేజ్ కాస్ట్యూమ్స్తో అదరగొట్టింది!
‘సినిమాలో ఒక పాత్రకు ప్రాణం పోయాలంటే నటనతో పాటు.. పాత్రకు తగినట్లుగా నటీనటుల కోసం ఎంచుకునే కాస్ట్యూమ్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయం’టున్నారు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ఎకా లఖానీ. చరిత్రాత్మక కథల్లో, అదీ పాశ్చాత్య వింటేజ్ స్టైల్స్తో భారతీయ సినిమాకు హంగులద్దడంలో ఆమె దిట్ట! ఇందుకు...తరువాయి

67 ఏళ్ల వయసులో మోడలింగ్ చేస్తోంది.. ఈ డాక్టర్!
వివిధ కారణాల వల్ల చాలామంది తమ అభిరుచిని పక్కన పెట్టి ఏదో ఒక ఉద్యోగం చేస్తూ కాలం గడిపేస్తుంటారు. తీరా, పరిస్థితులు చక్కబడ్డాక ఈ వయసులో ఏం చేస్తామని వెనకడుగు వేస్తుంటారు. కానీ, కొంతమంది మనసుకు నచ్చిన పని చేయడానికి వయసు అడ్డంకి కాదని నిరూపిస్తుంటారు. దిల్లీకి చెందిన డాక్టర్ గీతా ప్రకాశ్ ఈ జాబితాలో ముందు....తరువాయి

అర్ధరాత్రైనా అక్క సాయం చేస్తుంది...
అర్ధరాత్రి 12. సుమతికి నొప్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో వాళ్లు ఈమెకు ఫోన్ చేశారు. క్షణాల్లో ఆసుపత్రికి చేర్చిందామె. దివ్యకు ఆఫీస్లోనే బాగా ఆలస్యమైంది. సమయమేమో రాత్రి 11 దాటింది. ఏ ఆటో ఎక్కాలన్నా భయమే. మళ్లీ ఆమెకే ఫోన్.. సురక్షితంగా ఇంటికి చేరుకుంది. ఎన్నో సంఘటనలు..తరువాయి

నోబెల్ రెండు సార్లు!
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇచ్చే అత్యుత్తమ పురస్కారం నోబెల్ను అందుకున్న మొదటి మహిళ మేరీ క్యూరీ. రెండుసార్లు ఈ పురస్కారాన్ని పొందిన ఏకైక మహిళ కూడా ఆమే. భౌతిక, రసాయన శాస్త్రాల్లో చేసిన కృషికి ఈ గౌరవం దక్కింది. మేరీ పోలండ్లో నవంబరు 7, 1867లో పుట్టారు. పూర్తి పేరు మరియ సలొమియ స్క్లొడొస్క.తరువాయి

నిండు గర్భంతోనే కర్రసాము విన్యాసాలు..!
గర్భిణిగా ఉన్నప్పుడు చిన్న చిన్న బరువులెత్తడానికే ఇబ్బంది పడిపోతుంటాం.. ఇక నెలలు నిండే కొద్దీ ఆయాసంతో కాలు కూడా కదపలేం. కానీ కొంతమంది ఈ సమయంలోనూ కఠిన వ్యాయామాలు చేస్తూ, బరువులెత్తుతూ, వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. తమిళనాడులోని అనైక్కడు గ్రామానికి చెందిన షీలాదాస్ ఇందుకు తాజా....
తరువాయి

Assembly Elections: అందాల రాణి.. ప్యాడ్ వుమన్..ఇప్పుడు ఎమ్మెల్యేలయ్యారు!
‘రాజకీయాలంటేనే రొంపి.. అందులో దిగలేం.. దిగితే బయటపడలేం..’ అనుకుంటారు చాలామంది. ‘కానే కాదు.. ప్రజా సేవకు ఇదో వారధి..’ అంటున్నారు పంజాబ్కు చెందిన ఇద్దరు మహిళలు. గాయనిగా ఒకరు, ప్యాడ్ ఉమన్గా మరొకరు పేరుగాంచినా.. అక్కడితో సరిపెట్టుకోకుండా.. ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఇదే లక్ష్యంతో, నిండైన ఆత్మవిశ్వాసంతో తాజా......తరువాయి

రెండొందల రోబోలు చేయించా!
విదేశాల్లో పిల్లలు రోబోటిక్ పరిజ్ఞానంలో మనకంటే 20 ఏళ్లు ముందున్నారు. ఆ అవకాశం మన పిల్లలకీ అందించాలనే లక్ష్యంతో అడుగువేశారు హైదరాబాద్కి చెందిన ప్రసూన దేవలపల్లి. ఇంతవరకూ 20 వేల మంది పిల్లలకు శిక్షణ అందించిన ఆమె తన గురించి వసుంధరతో పంచుకున్నారు... ప్రసూన వాళ్లది వరంగల్ జిల్లా హనుమకొండ. కాకతీయ విశ్వ విద్యాలయంలో మైక్రోబయాలజీ చేశారు....తరువాయి

అందమైన కళాఖండాలన్నిటినీ కేక్స్గా మార్చేస్తుంది!
కేక్స్ చాలామంది తయారుచేస్తారు.. కానీ వాటిని విభిన్నంగా అలంకరించే ఓర్పు-నేర్పు కొందరికే ఉంటుంది.. మరికొందరు తమ సృజనతో వాటికి కొంగొత్త హంగులద్దుతుంటారు.. అలాంటి వాళ్లే ప్రపంచ మెప్పు పొందుతారు. పుణేకు చెందిన ప్రాచీ ధవళ్ దేవ్ కూడా అలాంటి అరుదైన కళాకారిణే! రాయల్ ఐసింగ్ ఆర్ట్లో ప్రావీణ్యం పొందిన ఆమె.. విశ్వవ్యాప్తంగా ఉన్న ఎలాంటితరువాయి

అమ్మయ్యాకే మోడల్గా ఎదిగింది!
అమెరికాలో ఉద్యోగం, ప్రేమ వివాహం. ఆపైన ఓ పాప.. అనుకున్నవన్నీ సాధిస్తూ వచ్చిందామె. తల్లి అయ్యాక ‘జీవితమంటే ఇల్లు, ఉద్యోగం... ఇంతకు మించి ఏమీ ఉండదా’ అనే ప్రశ్న ఎదురైనపుడు... ఏదైనా మన చేతుల్లోనే ఉంటుందని సమాధానమిచ్చుకుంది. ఇష్టమైన మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఇప్పుడు అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికల మీద మెరుస్తోంది తెలుగమ్మాయి చైతన్య పొలోజు. సవాళ్లతో కూడిన తన ప్రయాణాన్ని వర్జీనియా నుంచి వసుంధరతో పంచుకుందిలా...తరువాయి

‘నారీ శక్తి’కి నిలువెత్తు రూపాలు!
ఉనికే లేని గిరిజన భాషకు లిపిని రూపొందించిన ఘనత ఒకరిదైతే.. శారీరక లోపాన్ని అధిగమించి నృత్యంతో ప్రపంచాన్ని మెప్పించారు మరొకరు.. విషసర్పాలతో ఆడుకుంటూ.. వాటికి ప్రాణ దాతగా మారారు ఇంకొకరు.. మహిళ తలచుకుంటే ఆరు నూరైనా.. తాను అనుకున్నది సాధించగలదని నిరూపించారు ఇలాంటి ఎందరో మహిళామణులు.తరువాయి

ప్రియమైన నాన్నా..
ఉదయం మేం మేల్కొనేది అమ్మ పిలుపుతోనే! స్కూలుకి సిద్ధం కావడానికి కావాల్సివన్నీ తనే అమర్చి పెట్టేస్తుంది. స్నానం చేసొచ్చేసరికి వేడి వేడిగా టిఫిన్ అందిస్తుంది. బాక్సు సర్ది సమయానికి స్కూలు చేరుకునేలా చూస్తుంది. రాత్రి మేం నిద్రపోయే వరకూ మా పక్కనే ఉంటుంది. మాతోపాటే నిద్ర పొమ్మంటే..తరువాయి

Womens Day Webinar: ఓ అతివా.. ఆకాశమే హద్దుగా సాగిపో!
అదీ ఇదీ అని లేకుండా- అవని నుంచి అంతరిక్షం దాకా.. మేరునగమై.. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు.. తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.. మగవాళ్లకు దీటుగా.. అన్నిట్లోనూ దిట్టగా.. మనకు సాటి లేదంటూ మున్ముందుకు సాగిపోతున్నారు..! పెద్ద పెద్ద సంస్థలకు అధిపతులుగా.. దేశాధినేతలుగా.. తిరుగులేని నాయకులుగా రాణిస్తున్నారు..!తరువాయి

Womens Day: ‘లింగవివక్షను అధిగమిద్దాం’.. ఈనాడు వసుంధర వెబినార్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘లింగవివక్షను అధిగమిద్దాం’ అనే అంశంపై ‘ఈనాడు-వసుంధర’ ప్రత్యేక వెబినార్ నిర్వహించింది. దీనిలో పలువురు మహిళా ప్రముఖులు పాల్గొని మహిళా సాధికారతకు సంబంధించిన వివిధ అంశాలపై తమ విలువైన సూచనలు, సలహాలు అందించారు. ఈ వెబినార్ వీడియో చూడండి.
తరువాయి

ఒత్తిడిని ఓడించి.. చిరునవ్వులు చిందిస్తారు..
ఏ వృత్తిలో ఉన్నా మహిళలు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. ఆ క్రమంలో ఒత్తిడికి గురి కావడం సాధారణం. ఆమె ఇల్లాలు కూడా అయితే ఆ తీవ్రత మరీ ఎక్కువ. ఈ మానసిక సమస్య కొన్నిసార్లు మరికొన్ని సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఒత్తిడిని చిత్తుచేయడం ఆధునిక మహిళకు చాలా ముఖ్యం.తరువాయి

వెండితెరపై మెరిసిన తొలి నటీమణి!
హీరోయిన్ అవుతానని ఒక మధ్యతరగతి ఆడపిల్ల అంటే వింతగా చూసే కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. అలాంటిది వందేళ్లకు పూర్వం అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో వూహించడం కూడా కష్టమే..! కానీ ఆనాడు ఆమె వేసిన మొదటి అడుగే ఇవాళ ఇంతమంది నటీమణుల ఆశయాలకు పునాదిగా నిలిచింది.....తరువాయి

నాన్న కోసం... బ్యాట్ పట్టుకున్నా!
నాన్నకి క్రికెట్ అంటే పిచ్చి. భారత్ ఓడితే తట్టుకోలేడు.. ఆయన ఇష్టాన్ని చూసి కూతురు దాన్నే కెరియర్గా ఎంచుకుంది. సినిమా కథ గుర్తొస్తోందా? కర్నూలు అమ్మాయి నీరుగట్టి అనూష జీవితమిది. టీకొట్టు నిర్వహించే నాన్న కలను దేశవాళీ జట్టుకు ఆడేదాకా ఎలా తీసుకెళ్లిందో.. తన మాటల్లోనే..!తరువాయి

Women Cricket: ఉనికి చాటారు.. అంచనాలు పెంచేశారు!
క్రికెట్ ప్రపంచకప్ ఫీవర్ మళ్లీ మొదలైంది.. అయితే ఈసారి ఆట అమ్మాయిలది! మొన్నటిదాకా జెంటిల్మెన్ గేమ్గా ముద్రపడిపోయిన క్రికెట్ను అమ్మాయిలు తమ ఆటతో తమ వైపు తిప్పుకున్నారు. తాము ఆడే ప్రతి మ్యాచ్నూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆస్వాదించేలా అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. పట్టుబట్టి బంధనాలు తెంచుకొని జెంటిల్మెన్ గేమ్ను కాస్తా లేడీస్...తరువాయి

కొడుకు చదువు కోసం.. కాలు బయట పెట్టింది!
ఇల్లు, కొడుకు ఇదే ఆమె లోకం. తన వరకూ ఎన్ని కష్టాలెదురైనా ఓర్చుకుంది. కొడుకు విషయానికొచ్చేసరికి తట్టుకోలేకపోయింది. అందరికీ ఎదురు తిరిగింది. వీధి కన్నెరుగని ఆమె దేశమంతా పర్యటిస్తోంది. కొడుకుని ఉన్నతవిద్యకు లండన్ పంపింది. భర్తకు సొంత వ్యాపారాన్ని చేకూర్చింది. మీనూ జైన్కి ఇదంతా ఎలా సాధ్యమైంది? హైదరాబద్ వచ్చిన మీనూ ‘వసుంధర’తో పంచుకుంది.తరువాయి

డైపర్ను కనిపెట్టిందీ అమ్మ!
బిడ్డ ఆకలితో ఏడుస్తోందా.. అజీర్తితోనా? మరేదైనా కారణమా అన్నది అమ్మకు ఇట్టే తెలిసిపోతుంది. బిడ్డకు ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా ఆమె మనసు విలవిలలాడుతుంది. డోనోవన్ కూడా అంతే. మాటిమాటికీ తడిసే లంగోటా తన పాపాయికి ఇబ్బంది కలిగించడం గమనించారు. దాన్ని దూరం చేయడానికి ఆవిడ చేసిన ప్రయత్నమే ఇప్పుడు మన పిల్లలకు వాడుతున్న డైపర్. దీని తయారీకి ఆమె షవర్ కర్టెన్ను ఎంచుకున్నారు. దానికి అడుగున చుట్టూ పాస్టిక్ కాగితాన్ని కలుపుతూ రూపొందించి, దానికితరువాయి

First Woman : ఆమే తొలి మహిళా న్యూస్ రీడర్!
ఆకట్టుకునే రూపం, శ్రావ్యమైన కంఠస్వరం, చుట్టూ జరుగుతున్న విషయాలపై కనీస పరిజ్ఞానం.. న్యూస్ రీడర్లు కావాలనుకునే వారికి ఉండాల్సిన కనీస అర్హతలివి. ఇలాంటి విషయాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే రెండాకులు ఎక్కువ చదివారని చెప్పడంలో సందేహం లేదు. అందుకే ఏ ఛానల్లో చూసినా వార్తలు చదివే వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా....తరువాయి

Women Priests: ఆ అభిప్రాయం మార్చేస్తున్నారు!
గుడికెళ్తే అర్చన చేసే పూజారి పురుషుడే.. పెళ్లిలో వేదమంత్రాల సాక్షిగా దంపతుల్ని కలిపేదీ పురుష పురోహితుడే.. ఆఖరికి పిండం పెట్టాలన్నా పురుష పూజారికే పిలుపు అందుతుంది.. కానీ రాన్రానూ ఈ ట్రెండ్ మారుతోంది. మహిళలు వేదమంత్రాలు పఠించడానికి అనర్హులు అన్న మూసధోరణిని....తరువాయి

SEBI: బ్యాంకర్ నుంచి ఛైర్పర్సన్గా ఎదిగారు!
ఓ సాధారణ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి.. తమ ప్రతిభ-నైపుణ్యాలతో అంచెలంచెలుగా ఎదిగి.. ఓ సంస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టడమంటే మాటలు కాదు. అలాంటి అరుదైన అవకాశాలు అతి కొద్దిమందికే దక్కుతాయి. ముంబయికి చెందిన మాధవీ పూరీ బుచ్ కూడా తాజాగా అలాంటి ఘనతనే అందుకున్నారు...తరువాయి

‘పరాఠా’లే ఆమె జీవితాన్ని నిలబెట్టాయి!
సమయం మనది కానప్పుడు సంయమనం పాటించాలి.. ప్రతికూలతల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని వెతుక్కోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో పరాఠాల్నే తన జీవనోపాధి మార్గంగా ఎంచుకుంది అమృత్సర్కు చెందిన వీణ అనే మహిళ. భర్త పోయి నలుగురు కూతుళ్ల ఆలనా పాలనా తనపై పడిన తరుణంలో.......తరువాయి

తాళిని తాకట్టుపెట్టి టీకప్పులు చేస్తున్నా
భర్తకు అనారోగ్యం... కొవిడ్ కారణంగా ఉన్న ఉద్యోగం పోయి దిక్కుతోచని సమయం. తనకొచ్చిన కష్టం మరెవరికీ ఎదురవ్వకూడదనే ఆలోచన నుంచే ఆమెకు ఉపాధి మార్గం దొరికింది. వాడి పారేసే ప్లాస్టిక్ టీ కప్పుల స్థానంలో... తాగిన తర్వాత తినేసే కప్పుల తయారీని ఉపాధిగా ఎంచుకుంది. ఇప్పుడు ఆరు రాష్ట్రాలకు వీటిని ఎగుమతి చేస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు విశాఖపట్నానికి చెందిన తమ్మినైన జయలక్ష్మి...తరువాయి

IKEA: తొలి మహిళా సారథి!
మహిళలు ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఒంటి చేత్తో కంపెనీల్ని నడిపే స్థాయికి ఎదుగుతున్నారు. దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. తొలి మహిళలుగా కీర్తి గడిస్తున్నారు. సుసానే పుల్వెరర్ కూడా తాజాగా ఇలాంటి అరుదైన ఘనతే అందుకుంది. ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియా ఇండియాకు తొలి మహిళా సీఈఓగా నియమితురాలైందామె.తరువాయి

ఈ రిక్షా వీళ్ల జీవితాలను మార్చింది
మారుమూల ప్రాంతంలో జీవించే ఆ మహిళలంతా ఇప్పుడు ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని సాధికారత సాధిస్తున్నారు. ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గుజరాత్లో ప్రముఖ పర్యటక కేంద్రంగా మారిపోయిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహం దగ్గర ఈ రిక్షాలు నడుపుతున్న గిరిజన మహిళల విజయగాథ ఇది...తరువాయి

ప్రజాసేవ చేస్తాం.. చదువునూ కొనసాగిస్తాం..!
యువత రాజకీయాల్లోకి రావాలని పలువురు పిలుపునిస్తోన్నా.. చాలామంది దూరంగానే ఉంటున్నారు. రాజకీయ రణరంగంలో ప్రవేశించడానికి విముఖత చూపిస్తున్నారు. కొంతమంది వచ్చినా అందులో సింహభాగం రాజకీయ వారసులదే. ఇక మహిళల విషయానికొస్తే రాజకీయాల్లో ఇప్పటికీ వారి సంఖ్య స్వల్పంగానే ఉంటోంది.
తరువాయి

కరవు నేలకి కళ తెచ్చింది!
కరవు నేలలో... సిరులు కురిపించేందుకు వందల గ్రామాలకు కాలినడకనే వెళ్లారామె.. ఆమె వేసిన పొదుపు విత్తనం ఇంతింతై... నేడు 183 గ్రామాల్లో విస్తరించింది. వేల మంది మహిళలని సేంద్రియ సాగు వైపు నడిపించి, టింబక్టు ఆర్గానిక్ బ్రాండ్కి శ్రీకారం చుట్టిన ఆమె మరెవరో కాదు.. అనంతపురానికి చెందిన మేరీ వట్టమట్టమ్. 25 వేల మంది మహిళా పొదుపు సైనికులను ముందుండి నడిపిస్తున్నారు మేరీ...తరువాయి

చూశారా.. అరవైల్లో ఇరవై అంటే ఇదేనేమో..!
ఈ రోజుల్లో చాలామంది ఓ కిలోమీటరు నడిచేసరికే కాళ్లు లాగుతున్నాయంటారు. ఎత్తైన మార్గానికి వెళ్లినప్పుడు ఒక్కసారి ఎక్కేసరికి నా వల్ల కాదని కూలబడిపోతుంటారు. కానీ కొంతమంది వయసు పైబడినా ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా యువతతో పోటీపడుతుంటారు. కర్నాటకకు చెందిన నాగరత్నమ్మ ఈ కోవకే చెందుతారు.తరువాయి

ఓ ప్రశ్న, సినిమా.. రూ.137 కోట్ల వ్యాపారం!
కెరియర్ ఎలా నిర్ణయించుకుంటాం? ఎన్నో సమాధానాలొచ్చాయా? నిధి యాదవ్ని అడిగి చూడండి. ఒక ప్రశ్న, ఒక సినిమా అని చెబుతుంది. చిత్రంగా ఉన్నా.. వీటి ఆధారంగానే వ్యాపారవేత్త అయ్యింది. కోట్ల వ్యాపారంగానూ తీర్చిదిద్దింది. ఆసక్తిగా ఉంది కదూ! అవేంటో.. ఆమె విజయ ప్రస్థానమెలా సాగిందో చదివేయండి.తరువాయి

ఆ బొమ్మలతో పిల్లల్లో స్ఫూర్తి నింపుతోంది!
ఇప్పటి పిల్లలు బొమ్మలంటే బార్బీ డాల్స్, కార్టూన్ క్యారక్టర్లతో రూపొందించిన బొమ్మల్నే ఇష్టపడుతున్నారు. కానీ పాతకాలం నాటి చేత్తో చేసిన బొమ్మలు, చెక్క బొమ్మల గురించి తెలిసిన చిన్నారులు ఈ కాలంలో చాలా అరుదుగా ఉన్నారని చెప్పచ్చు. ఈ ఆదరణ కరవై ఇప్పటికే అంతరించిపోయిన ఈ కళకు పునర్వైభవం తీసుకురావాలని నిర్ణయించుకుంది కొడైకెనాల్కు చెందిన....తరువాయి

వందల మందికి మాటిస్తోంది..
తన మనసులో మాట భర్తకి అర్థమయ్యేలా చెప్పడం కోసం సైగల భాషని నేర్చుకున్నారామె. కానీ ఈ సమస్య ఆయనొక్కరిదే కాదని తెలిశాక వందలమంది బధిరులకు సాయం చేయడం మొదలుపెట్టారు. పోలీస్స్టేషన్లూ, బ్యాంకులూ, ప్రభుత్వ కార్యాలయాలు... ఇలా ఎక్కడ తన సాయం కావాలన్నా క్షణాల్లో అక్కడుంటారు విజయనగరానికి చెందిన బూరాల లక్ష్మీకొండమ్మ. బధిరులకు, అధికారులకు మధ్య వారధిగా మారిన లక్ష్మి స్ఫూర్తిగాథ ఇది..తరువాయి

కాబోయే తల్లుల కోసం ఐఏఎస్ చిట్కాలు!
గర్భధారణ మొదలు నవమాసాలు మోసి బిడ్డను ప్రసవించే దాకా.. కాబోయే తల్లుల శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. వీటిలో కొన్ని మనల్ని అసౌకర్యానికీ గురి చేస్తుంటాయి. అయితే వీటిని సానుకూలంగా స్వీకరించి ముందుకు సాగినప్పుడే ప్రెగ్నెన్సీని ఆస్వాదించచ్చంటున్నారు ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ దుర్గా శక్తి నాగ్పాల్.తరువాయి

ఐక్యరాజ్యసమితిని... మెప్పించింది
మహిళలు వినియోగించిన శానిటరీ ప్యాడ్స్ను ఆరు బయట పడేయడం, దాని వల్ల కలిగే దుష్పరిణామాలు డాక్టర్ మధురితను కలచివేశాయి. పర్యావరణానికి హాని కలిగించే ఈ పద్ధతికి స్వస్తి పలికేలా చేయాలనుకుంది. దానికి తను చేసిన ఆలోచన సోలార్ ప్యాడ్ ఇన్సినరేటర్. సౌరశక్తితో పనిచేసే ఈ తరహా యంత్రం ప్రపంచంలోనే మొదటిది...తరువాయి

Sailing Expedition: అందుకోసమే ఈ సాహస యాత్ర!
మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్నా.. వారికి క్రీడారంగంలో లభించే ప్రోత్సాహం తక్కువగా ఉంటోంది. అయినా పీవీ సింధు, మిథాలీ రాజ్, మేరీకోమ్.. వంటి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని కొంతమంది వివిధ క్రీడల్లో అడుగుపెట్టి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే సెయిలింగ్ వంటి సాహస క్రీడల్లోకి మహిళలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.తరువాయి

‘పుష్ప’ లుక్ వెనుక ఆమె!
ఉంగరాల జుట్టు, కోరమీసాలు, ఒత్తైన గడ్డం, చామన ఛాయ, మెడలో గొలుసులు, అతిసాధారణ దుస్తులు.. ఇలా పక్కా మాస్ లుక్లో ‘తగ్గేదేలే’ అంటూ ‘పుష్ప’తో హిట్టు కొట్టాడు మన అల్లు అర్జున్. మరి, ఎప్పుడూ స్టైలిష్గా కనిపించే ఈ మెగా హీరోను ఈసారి పూర్తి మాస్ లుక్లో చూసి ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది...తరువాయి

సాఫ్ట్వేర్ వదిలి.. టైలరింగ్ అందుకుంది!
‘మంచి ఉద్యోగం కాదని.. టైలరింగ్ షాప్ పెడతావా?’ తన ఆలోచనను పంచుకున్నప్పుడు సుస్మిత లకాకులకు ఎదురైన ప్రశ్న ఇది. కానీ తన ఆలోచనపై తనకు నమ్మకం ఎక్కువ. అందుకే.. టైలరింగ్కు సాంకేతిక సేవలు జోడిస్తూ క్లౌడ్ టైలర్ ప్రారంభించారు. ఏడాది తిరిగేటప్పటికది లక్షల వ్యాపారమవడమే కాక కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. ఈ యువ వ్యాపారవేత్త ఏం చెబుతున్నారో చదవండి...తరువాయి

అనాథ వధువులకు సారె పెట్టి పంపిస్తాం!
కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ సంతృప్తి చెందే సేవా గుణం కొద్దిమందికే ఉంటుంది. ఆ కోవకే చెందుతారు సత్తి సునీత. దివ్యాంగులకు ఉపాధి, నిరుపేద చిన్నారుల చదువు, అనాథ యువతుల పెళ్లి, నిరాధార మహిళలకు చేయూత... ఇలా ఎవరు బాధల్ని చెప్పుకున్నా నేనున్నానంటారు. కష్టాల తీరం దాటిస్తారు!తరువాయి

గురుగ్రామ్కు తొలి మహిళా పోలీస్ కమిషనర్!
‘పోలీసులంటే రక్షక భటులు. తమ పనితీరుతో ప్రజా సమస్యల్ని పారదోలి.. వారి జీవితాన్ని సులభతరం చేయడంతో పాటు సౌకర్యవంతంగా మలచడమే తమ కర్తవ్యం..’ అంటున్నారు గురుగ్రామ్ కొత్త కమిషనర్గా తాజాగా ఛార్జ్ తీసుకున్న కళా రామచంద్రన్. మొన్నటిదాకా ఈ పదవిలో ఉన్న కేకే రావ్ వేరే చోటికి బదిలీపై వెళ్లడంతో ఆ స్థానంలో నియమితులయ్యారామె...తరువాయి

ఆ విషయంలో డిక్టేటర్నే!
‘పనిచేసేచోట నేను ‘డిక్టేటర్ని’... రాజీపడే ప్రసక్తేలేదు’ అంటారామె. ఆర్కిటెక్ట్గా.. అమెరికా, భారత్లలో 200కుపైగా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులని పూర్తిచేసి.. తాజాగా తెలంగాణా కలెక్టరేట్ సముదాయాలకు ప్రాణం పోశారు ఉషారెడ్డి. మగవాళ్లే ఎక్కువగా రాణించే ఈ రంగంలో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ఆమె 38 ఏళ్ల తన అనుభవాలని వసుంధరతో పంచుకున్నారు...తరువాయి

సునీతా-కేజ్రీవాల్.. ఈ క్రేజీ లవ్స్టోరీ విన్నారా?
‘ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది’ ఉన్నట్లే తన విజయం వెనుక తన భార్య సునీతా కేజ్రీవాల్ ఉందని చెబుతుంటారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ‘ఆమె లేకుంటే అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తికి గుర్తింపే లేదు.. నా భార్యే నా విజయ రహస్యం..’ అంటూ సందర్భం వచ్చినప్పుడల్లా తన ఇష్టసఖిని ఆకాశానికెత్తేస్తుంటారు.తరువాయి

చెత్త దిబ్బను నందనవనంగా మార్చేసింది..
తనో చిత్రకారిణి. దేశదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. అయినా ఏదో అసంతృప్తి. పుట్టిన నేలకు, ప్రకృతికి దూరంగా ఉంటున్నానన్నదే దానికి కారణమని ఊరికి వెళ్లినప్పుడు అర్థమైంది. అప్పుడే తన పూర్వీకుల భూమిని చూసింది. చెత్తదిబ్బగా ఉన్న ఆ ప్రదేశం ఆవేదనతో పాటు తనకో కొత్త లక్ష్యాన్ని నిర్దేశించింది... తన జీవన గమనాన్ని మార్చింది.తరువాయి

మనం సంస్కృతం చదవడమేంటంటే.. 5 స్వర్ణాలు సాధించింది!
సాధారణంగా కుటుంబ పెద్దను కోల్పోతే కూతుళ్లను చదువు మాన్పించి పెళ్లి చేయడం, కొడుకుల్ని పైచదువులు చదివించడం.. చాలా కుటుంబాల్లో మనం చూస్తుంటాం. అయితే లక్నో అమ్మాయి గజాలా కుటుంబం ఇందుకు భిన్నం. పదో తరగతిలో ఉండగానే తండ్రిని కోల్పోయిన ఆమెను చదివించడానికి ఆమె ఇద్దరు అన్నయ్యలు, అక్క చదువు మానేసి పనిలో చేరారు.తరువాయి

94 ఏళ్ల వయసులో ఎన్నికలకు ‘సై’ అంటోంది!
చాలామంది నలభై ఏళ్లు దాటగానే ‘ఈ వయసులో కొత్తగా ఏం చేస్తాంలే’ అని నీరసపడిపోతుంటారు. కానీ, కొంతమంది చేసే పనికి, వయసుకు సంబంధమే లేదని నిరూపిస్తుంటారు. చెన్నైకి చెందిన కామాక్షీ సుబ్రమణియన్ ఈ కోవకే చెందుతారు. ఆమె 94 ఏళ్ల వయసులో చైన్నై స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేశారు. తద్వారా ఆ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసిన అత్యంత పెద్ద వయస్కురాలిగా ఘనత సాధించారు.తరువాయి

వారి కళ్లలో మెరుపే నాకు స్ఫూర్తి
ఆమె పెద్దచదువులు చదువుకుంది. కానీ కుటుంబ బాధ్యతలు చేతులు కట్టేశాయి. బాబుని బడికి పంపాక ఉన్న తీరిక సమయంలో చేసిన రిటర్న్ గిప్టుల ఆలోచన ఆమెని వ్యాపారంలో ముందుకు నడిపించింది. లక్షల్లో టర్నోవర్ సాధిస్తూ ... నలుగురికి ఉపాధినిచ్చేలా చేసింది. విదేశాలకూ జ్యూట్ ఉత్పత్తులని అందిస్తూ శెభాష్ అనిపించుకుంటున్నతరువాయి

హూలాహూప్తో విన్యాసాలు.. ఈమెను మించినోళ్లు లేరు!
నా పనేంటో నేను చేసుకుపోతే చాలు అనుకునేవారు కొందరైతే.. తమ పనులతో చుట్టూ ఉన్న వాళ్లలో అనునిత్యం ప్రేరణ కలిగించాలనుకునేవారు మరికొందరుంటారు.. లాస్ వెగాస్కు చెందిన గెట్టి కెహయోవా రెండో కోవకు చెందుతుంది. సర్కస్ ఫీట్లు చేస్తూ పొట్ట పోసుకునే కుటుంబంలో పుట్టిపెరిగిన ఆమె.. అదే విద్యను తన అణువణువూ నింపుకొంది. అక్క ప్రేరణతో హూలాహూప్ సాధన మొదలుపెట్టి గిన్నిస్ రికార్డు ఒడిసిపట్టే స్థాయికి ఎదిగింది.
తరువాయి

ఆ తల్లుల కష్టం మరెవరికీ రాకూడదని...!
బిడ్డకు చిన్నగాయం అయితేనే అమ్మ మనసు తల్లడిల్లి పోతుంది... మరి ఆ బిడ్డకు తలసీమియా, సికెల్సెల్ అనీమియాలాంటి సమస్యలుంటే? మాటికీమాటికీ రక్తం మార్చాలి.. జీవితాంతం ఆస్పత్రుల చుట్టూ తిరగాలి. ఇక ఆ తల్లుల బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? ఇలాంటి ఇబ్బందుల్ని దగ్గరగా చూసిన డాక్టర్ సుమన్ ‘టీఎస్సీఎస్’ సొసైటీ వేదికగా 23 ఏళ్లుగా వైద్యసేవల్నందిస్తున్నారు. వసుంధరతో ఆ వివరాల్ని పంచుకున్నారిలా...తరువాయి

IOCL Director: అలా గ్లాస్ సీలింగ్ను బద్దలుకొట్టింది..!
మహిళలు కేవలం వంటింటికే పరిమితం అనే రోజులు మారుతున్నాయి. స్త్రీలు ఉద్యోగం చేయడమే కాకుండా పలు కంపెనీలకు అధిపతులుగానూ వ్యవహరిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పురుషాధిపత్యంలో ఉన్న పలు సంస్థల్లో గ్లాస్సీలింగ్ని బద్దలుకొడుతూ ముందుకు దూసుకుపోతున్నారు. ఇటీవలే ఓఎన్జీసీ సంస్థకు అల్కా మిత్తల్ సీఎండీగా, నిన్న జేఎన్యూకి శాంతిశ్రీ...తరువాయి

మహిళా సాధికారత కోసం ఆమె..!
పని ప్రదేశంలో మహిళలు తమదైన శైలిలో రాణిస్తుంటారు. అయినా వారికి లభించే అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. 2021 గ్లోబల్ జెండర్ గ్యాప్ సూచీలో భారత్ 140వ (మొత్తం 156 దేశాలు) స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. మహిళలకు ఆర్థిక అవకాశాలు కల్పించడంలో మన దేశం 149వ స్థానంలో ఉంది.తరువాయి

ఈ ‘ప్యాడ్ ఉమన్’ కథ విన్నారా?
తక్కువ ధరకే శ్యానిటరీ న్యాప్కిన్లను తయారుచేసే మెషీన్ని రూపొందించిన ‘ప్యాడ్మ్యాన్’ అరుణాచలం మురుగనాథమ్ కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన స్ఫూర్తితోనే గ్రామీణ మహిళల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు కంకణం కట్టుకుంది మధ్యప్రదేశ్కు చెందిన మాయా విశ్వకర్మ.తరువాయి

మహిళలు పుట్టుకతోనే సమర్థులు.. సంక్షోభాలను ఎదుర్కొనే శక్తి మన సొంతం!
మహిళలు ‘ఆకాశంలో సగభాగం’ అని చెప్పుకొంటున్నా వారికి సమాన అవకాశాలు దక్కడంలో మాత్రం ఇంకా వెనకబడే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ కంపెనీల్లో కేవలం 4 శాతానికి మాత్రమే స్త్రీలు సీఈవోలుగా ఉండడమే ఇందుకు ఉదాహరణ. చాలామంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారడానికి కృషి చేస్తున్నా వివిధ కారణాలతో మధ్యలోనే తమ ప్రయత్నాన్ని విరమిస్తున్నారు.
తరువాయి

అగ్గిపెట్టె ఇంటి నుంచి.. 130 కోట్ల టర్నోవర్ దాకా!
ఓ సంస్థకు సీఈఓ! వినడానికి ఎంత గొప్పగా ఉంటుంది? కానీ.. వినీతా సింగ్కి అదంతా సులువుగా ఏమీ రాలేదు. లక్షణమైన ఉద్యోగం కాదన్నందుకు ఇంట్లో వాళ్లతో విభేదాలు.. వర్షం పడితే మునిగిపోయే ఇంట్లో ఎన్నో కష్టాలు.. వరుస వైఫల్యాలు.. అయినా విజయాన్ని తరుముకుంటూ వెళ్లారు. ఓవైపు పిల్లల ఆలనాపాలనా, మరోవైపు వ్యాపారం.. అవలీలగా సాగిస్తూ.. ‘ఇది మాకు పెద్ద కష్టమేమీ కాదు’ అని నిరూపిస్తున్నారు. స్ఫూర్తిమంతమైన ఆమె ప్రయాణమిది!తరువాయి

క్యాన్సర్ చిన్నారుల జీవితాల్లో.. వెలుగులు నింపుతోంది!
హాయిగా సాగుతున్న జీవితం ఆమెది. అనుకోకుండా కూతురికి అనారోగ్యం. వెంటనే ఆసుపత్రిలో చేర్చాలన్నారు. కాస్త కలిగిన కుటుంబమే కాబట్టి వెంటనే సిద్ధమయ్యారు. పక్కనే ఇంకో చిన్నారిదీ విషమ పరిస్థితి. శస్త్రచికిత్స చేయించాలి. కానీ ఆ స్థోమత లేదా తల్లిదండ్రులకి.తరువాయి

కడుపులో బిడ్డతో యుద్ధభూమిలో విధులు...
ఒక చేతిలో రైఫిల్... మరో చేతిలో పసిబిడ్డ... కడుపులో మరోబిడ్డ! ఆ పరిస్థితుల్లోనూ యుద్ధభూమిలోంచి ఏమాత్రం వెనుకడుగు వేయాలనుకోలేదామె. బిడ్డలను కాపాడుకుంటూనే తల్లిలాంటి దేశం కోసం కార్గిల్ యుద్ధక్షేత్రంలో ధైర్యంగా నిలబడింది కెప్టెన్ యషికాహత్వాల్త్యాగి. ఈ రోజుకీ సైన్యంలో చేరాలనుకునే వారికి స్థైర్యాన్ని నూరిపోస్తున్న ఆమె అనుభవాలివి..తరువాయి

సంచలన తీర్పులకు కేరాఫ్ అడ్రస్..!
అడుగడుగునా పురుషాధిపత్యం కనిపించే పాకిస్థాన్ వంటి దేశంలో మహిళలు రాణించడం, ఉన్నత పదవులు అధిరోహించడమంటే కలలో మాటే అనుకుంటాం. అయితే సుప్రీం కోర్టుకు తొలి మహిళా జడ్జిగా ఎంపికై ఆ కలను నిజం చేశారు జస్టిస్ ఆయేషా మాలిక్. మత ఛాందసవాదం ఎక్కువగా ఉండే పాకిస్థాన్ వంటి దేశంలో ఇంతటి ఉన్నత పదవికి ఎంపికై చరిత్ర సృష్టించారు ఆయేషా.తరువాయి

దూసుకెళ్తున్నారు!
‘అమ్మాయిలంటే ఇలానే ఉండాలి..’ తరాలుగా సమాజంలో పాతుకుపోయిన ఈ సంప్రదాయ భావనలకి చెక్ పెట్టాలనుకున్నారు వీళ్లు. ఇందుకోసం అబ్బాయిలకు మాత్రమే పరిమితం అనుకున్న బైక్ రేసింగ్లో అడుగుపెట్టారు. ఖండాలు, దేశాలు చుట్టేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలపై చిన్నచూపుని తమదైన శైలిలో దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు...తరువాయి

ఓ చిట్కా..సెలబ్రిటీల్ని చేసింది!
యూట్యూబ్ అంటే యువతకే అన్న నిర్వచనం మార్చారు వీళ్లు. వాళ్లతో పోటీ పడుతూ తక్కువ వ్యవధిలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతోమందికి బంధువులయ్యారు. అంత వరకూ ఇల్లే ప్రపంచంగా ఉన్న ఈ గృహిణులు తమ సెకండ్ ఇన్నింగ్స్లో సెలబ్రిటీలై పోయారు.. కనకదుర్గ, విజయలక్ష్మి. ఇలా చెబితే ఎవరబ్బా అనుకోవచ్చేమో....
తరువాయి

అత్తింటి వారసత్వం అందుకుంది
అత్తమామలు కరవు సీమ తలరాత మార్చారు. ఆమె వారి వారసత్వాన్ని అందుకుంది. ‘సమయం కన్నా రెట్టింపు పని చేయాలి. సాయం కోరి వచ్చినవారిని తిప్పి పంపొద్దు..’ అన్న వాళ్ల మాటల్నే వేదవాక్కులా పాటిస్తోంది. వారి బాటలో పయనిస్తూనే సేవా పరిధిని విస్తరిస్తూ వెళుతోంది. కొవిడ్ సమయంలోనూ నాయకురాలిగా ధైర్యంగా ముందుకు సాగుతూ మరెందరినో నడిపిస్తోంది. అనంతపురానికి చెందిన విశాల ఫెర్రర్.. సేవా ప్రయాణమిది!తరువాయి

దత్తత తీసుకుందామనుకున్నా... కానీ అంత్యక్రియలకి వెళ్లా!
నేను పుట్టిపెరిగింది ఒడిశాలో. నాన్న కృష్ణానంద, అమ్మ సూర్యమణి. అమ్మమ్మ వాళ్లది కాకినాడ. ఇంట్లో అందరూ తెలుగు మాట్లాడుతుంటే నాకూ వచ్చింది. మావారు చంద్రశేఖర్ యురోపియన్ సంస్థకి ఫైనాన్స్ గ్లోబల్ హెడ్. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి స్నిగ్ధ్ద దిల్లీలో ఇంజినీరింగ్ చదువుతోంది. చిన్నమ్మాయి సమీర ఇంటర్ చదువుతోంది. నేను వేరే ఊళ్లకు వెళ్లాల్సి వస్తే.. చిన్న పాప, మావారు ఆసుపత్రికి వెళ్లి పిల్లలకు ఆహారం అందిస్తారు....తరువాయి

లక్షల జీవితాలకు శ్రీమహాలక్ష్ములు
‘ఆడవాళ్లకేం తెలుసు డబ్బు గురించి?’... పదేళ్ల క్రితం వరకూ తరచూ వినిపించిన మాటే ఇది. ఉన్నత చదువులు, అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఈ పరిస్థితిలో మార్పుతెస్తున్నాయి. దానికి నిదర్శనంగానా అన్నట్టు... ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆర్థిక రంగంలో అద్భుతాలు చేస్తూతరువాయి

అమ్మయ్యాక తిరిగొచ్చింది.. ఆ రికార్డు బద్దలుకొట్టింది!
ఆడవాళ్లు తమ కెరీర్కి ఎంత ప్రాధాన్యమిస్తారో.. ఇంటికీ అంతకంటే ఎక్కువ సమయం వెచ్చిస్తుంటారు. ఇంటి బాధ్యతల రీత్యా అవసరమైతే కొన్నాళ్ల పాటు కెరీర్ బ్రేక్ తీసుకొని మరీ.. తిరిగి పుంజుకొని విజయాలు సాధిస్తారు. అమెరికా పరుగుల రాణి ‘కైరా డి అమతో’నే ఇందుకు తాజా ఉదాహరణ. అమ్మయ్యాక పిల్లల ఆలనా పాలన కోసం ఎనిమిదేళ్లు వెచ్చించిన ఆమె..తరువాయి

100 సంస్థలు... 10వేల మందికి సేవలు
‘పెళ్లి తర్వాతా చదువుకుంటా’... ఈ షరతు పెట్టి వివాహానికి అంగీకరించిన ఆమె అనుకున్నట్టుగానే పట్టుదలగా సీఏ చదివారు. పదిహేనేళ్లు ప్రాక్టీసూ చేశారు. అయినా ఇంకేదో సాధించాలన్న తపన తనను నిలవనీయలేదు. సకల సదుపాయాలతో ఆఫీసు స్థలాన్నిఅందించే సరికొత్త వ్యాపార ప్రయోగం చేసి మన దేశంలోని ప్రధాన నగరాలన్నింటా విస్తరించారుతరువాయి

కాదన్నవాళ్లే ప్రశంసించారు!
అందరూ సాఫ్ట్వేర్ అంటూ పరుగులు పెడుతోంటే.. ఆమె మాత్రం దాన్ని వదులుకుంది. లక్షల రూపాయల వేతనం, ఉన్నతావకాశాలు, భవిష్యత్ భరోసా.. ఇవేమీ ఆమెకు తృప్తినివ్వలేదు. దీంతో అభిరుచివైపు అడుగులు వేసి, పేస్ట్రీ చెఫ్ అయ్యింది. ఆమె ఈ నిర్ణయం ఎంతోమంది మహిళలకూ ఉపాధినీ చూపుతోంది. విజయవాడకు చెందిన ఉషా పోలు.. తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారిలా!...తరువాయి

యాభైయ్యేళ్లుగా బధిరులకు ఆశాదీపం
బధిర చిన్నారులకు సేవలందించే తల్లిదండ్రులను చూస్తూ పెరిగారు డాక్టర్ శాండ్రా దెశా సౌజా. అదే ఆమెను ఈఎన్టీ సర్జన్గా చేసింది. దేశంలోనే కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స చేసిన తొలి వైద్యురాలిగా నిలిచారు. డాక్టర్ శాండ్రా అసాధారణ కృషికి గానూ పద్మశ్రీ పురస్కారాన్నీ అందుకున్నారు.తరువాయి

Mrs World: అమ్మయ్యాకా.. ఏదైనా సాధ్యమే!
పెళ్లై పిల్లలు పుడితే ఇక మహిళల కెరీర్ ముగిసినట్లే అని భావిస్తారు. ఒకవేళ అవకాశాలు తలుపుతట్టినా రాణించలేరని నిరుత్సాహ పరుస్తుంటారు. కానీ కొంతమంది మహిళలు ఇందుకు భిన్నం. ఆలిగా ఇంటి బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే, అమ్మగా పిల్లల బాగోగుల్ని చూసుకుంటూనే.. తమకు ఆసక్తి ఉన్న రంగంలో సత్తా చాటుతున్నారు.తరువాయి

స్వచ్ఛమైన తేనె..సరికొత్త తోవ చూపింది!
మన ఊళ్లలో తేనెతుట్టెల నుంచి తేనె తీయడం చూసే ఉంటారు. చాలా సందర్భాల్లో శుచీ, శుభ్రత కొరవడతాయి. దానివల్ల స్వచ్ఛతలోనూ తేడా వస్తుంది. పైగా పెద్ద సంఖ్యలో తేనెటీగలూ చనిపోతాయి. ఈ పరిస్థితుల్లో మనం కొంటున్న తేనె ఎంత స్వచ్ఛమో తెలియదు. ఇవన్నీ ఎందుకు? మనమే నాణ్యమైన తేనెను....తరువాయి

వేల కోట్ల అప్పులకు వారసురాలైంది
మాజీ సీఎం కూతురు, ప్రముఖ వ్యాపారవేత్త భార్య.. అదృష్టవంతురాలు అనేస్తాం కదా! ఇంకో కోణంలో చూద్దాం. జీవితంలో స్థిరపడని పిల్లలు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇప్పుడేం అనిపిస్తోంది? భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! ఈ రెండు కోణాలు ఒకరివే.తరువాయి

వాళ్ల కోసం చిప్స్ ప్యాకెట్లతో దుప్పట్లు తయారుచేస్తోంది!
రోడ్డు పక్కన, ఫుట్పాత్పై పడుకొనే నిరుపేదలు చలికి తట్టుకోలేక ఫ్లెక్సీలు, కవర్లు కప్పుకొని పడుకోవడం చూసి చలించిపోతాం. అలాంటి వారికి వెంటనే ఓ దుప్పటి కొనిస్తాం. లేదంటే తోచినంత డబ్బిస్తాం. యూకేకు చెందిన అలిస్సా డీన్ కూడా ఇలాగే దుప్పట్లు పంచిపెడుతోంది. అయితే అందులో కొత్తేముంది.. అని ఆలోచిస్తున్నారా?
తరువాయి

197 వీడియోలు... 79 లక్షల వీక్షణలు
పెళ్లయ్యాక ఏమాత్రం అవగాహన లేని దేశానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ తన చదువుకు తగిన ఉద్యోగాల్లేవు. కెరియర్ మార్చుకోవడానికి కోర్సులు చేసింది. ఇంతలో పాప! ఈసారి యూట్యూబ్ ఛానెల్పై దృష్టిపెట్టింది. అక్కడా చుక్కెదురే! కానీ ఏదైనా ప్రయత్నించాలనే తపన లావణ్యా రెడ్డిది. ఈసారి పంథా మార్చింది.. నీలూస్ వ్ల్లాగ్స్ ఫ్రమ్ ఆఫ్రికా పేరుతో ఆ దేశ విశేషాలను పంచుకుంటోంది. ఈసారి పేరు, ఆదాయం రెండూ వచ్చాయి. ఆ విశేషాలు.. తన మాటల్లోనే..!తరువాయి

వేల పచ్చళ్ల రాణి
ఆవకాయ, ఉసిరి, చింత ఇలా అందరికీ తెలిసిన పచ్చళ్లు పదో ఇరవయ్యో ఉంటాయి. అయితే ఆవిడ పుస్తకంలో వెయ్యి రకాల పచ్చళ్ల తయారీ పద్ధతులు... చదువుతుంటేనే నోరూరిస్తాయి. అలాగే వెయ్యిరకాల రసాలపై మరో పుస్తకం అందరితో లొట్టలేయిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే... ‘ఇండియాస్ పికిల్ క్వీన్’ ఉషా ప్రభాకరన్....తరువాయి

Sports Biopics: క్రీడాకారిణులుగానూ అదరగొట్టేస్తున్నారు!
‘తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత..’ అంటుంటారు. మైదానంలో మెరికల్లాంటి ప్రదర్శన చేసే క్రీడాకారిణుల జీవితానికి ఇది అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. తమ ఆటతో దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చే అమ్మాయిలు ఇక్కడిదాకా రాగలిగారంటే.. దాని వెనుక ఎన్నో కష్టాలు, సవాళ్లు దాగుంటాయి.తరువాయి

రికార్డుల కోసమే పుట్టిందేమో..!
జడ వేసుకునేటప్పుడు ఓ వెంట్రుక లాగినట్లనిపిస్తేనే ఓర్చుకోలేం. అలాంటిది జుట్టుతో కిలోలకు కిలోలు బరువులెత్తే సాహసం చేయగలమా?! కానీ పంజాబ్కు చెందిన ఆశా రాణి మాత్రం ఒళ్లు గగుర్పొడిచే ఇలాంటి విన్యాసమే చేసింది. తన జుట్టుతో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 12 వేల కిలోలకు పైగా బరువున్న డబుల్ డెక్కర్ బస్సును అలవోకగా లాగింది..తరువాయి

ఆమె ఆలోచన... వేల మందికి ఉపాధి
బడికెళ్లే కూతురి కోసం బూట్లు కొనే పరిస్థితి లేక తనే స్వయంగా అల్లింది. ఆ సృజనాత్మకతే ఆమెను వాణిజ్య రంగంలో ఇప్పుడు విజయాలు సాధించేలా చేస్తోంది. ఈమె ఉత్పత్తులకు ప్రపంచమార్కెట్లో గిరాకీ ఉంది. ప్రముఖ ట్రేడ్ ఫెయిర్స్లోనూ ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటున్న 61 ఏళ్ల ముక్తామణి దేవి వేల మందికి శిక్షణ కూడా ఇస్తోంది.తరువాయి

ఆ కమిటీలో ‘ఆమె’ ఒక్కర్తే!
మహిళల సమస్యలు సాటి మహిళలకే అర్థమవుతాయంటారు. మరి, వాటి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, చక్కటి పరిష్కారం వెతకాలన్నా.. ఎక్కువ మంది స్త్రీలు కలిసి గళమెత్తితేనే అది సాధ్యమవుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు సుస్మితా దేవ్.తరువాయి

నెరిసిన జుట్టుతో ‘సిల్వర్’ స్టార్ అయిపోయింది!
ఒక్క తెల్ల వెంట్రుక కనిపిస్తేనే ఉసూరుమంటాం.. వెంటనే రంగేసుకొని నలుగురికీ కనిపించకుండా దాచేస్తుంటాం. పదమూడేళ్లుగా తానూ ఇదే చేశానంటోంది రాజస్థాన్కు చెందిన అంజనా దుబే. పన్నెండేళ్ల వయసులో నెరిసిన జుట్టుతో ఆత్మన్యూనతకు గురైన ఆమె.. అప్పట్నుంచి హెయిర్ కలర్తోనే ఆ విషయాన్ని దాచే ప్రయత్నం చేసింది.తరువాయి

ఎక్కడా వెనకడుగు వేయలేదు.. ఈ ఐజీ!
పోలీసు ఉద్యోగమనేది కేవలం పురుషుల కోసమే.. ఇందులో మహిళలు రాణించలేరనే భావన చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ భావన అధికంగా ఉంటుంది. అయినా, ఈ ధోరణిని అధిగమించి కొంతమంది మహిళలు పోలీసులుగా రాణిస్తూనే ఉన్నారు. ఈ కోవకే చెందుతుంది అస్సాంకి చెందిన వయలెట్ బారువా.తరువాయి

దుర్గవ్వ నోట.. బీమ్లా నాయక్ పాట
ఆమె పాడితే పల్లెదనం కళ్లముందు సందడి చేస్తుంది. శ్రమజీవుల అలుపుతీర్చే ఆ పాటకు ప్రేరణ ఆమె జీవితమే. ‘సిరిసిల్లా సిన్నది...’ అంటూ సోషల్ మీడియాలో లక్షలమంది అభిమానులని సంపాదించుకుంది. తాజాగా బీమ్లానాయక్ సినిమాలో తన పాటతో ఉర్రూతలూగిస్తోంది... ఆమే కుమ్మరి దుర్గవ్వ. చదువు లేకపోయినా ఆశువుగా పాటలు కట్టేసే దుర్గవ్వ తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుందిలా...తరువాయి

విశ్వవేదికపై భారతీయ సౌందర్యం!
విశ్వ సుందరి కిరీటం మన అమ్మాయి హర్నాజ్ సంధు సాధించినప్పుడు దేశమంతా గర్వంతో ఉప్పొంగి పోయింది. ఆమెలాగే మరో ఇద్దరూ తమ ప్రతిభను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించి, దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేశారు. ఐశ్వర్య జయచంద్రన్ మిసెస్ ఇండియా కిరీటం గెలుచుకొని ప్రపంచ పొటీలకు సిద్ధమవుతోంది. రాధికా రానే మిసెస్ ఆసియా యూఎస్ఏ పోటీల్లో రన్నరప్గా గెలిచింది.తరువాయి

వ్యాపార విజయం ‘పట్టు’బడింది!
చిన్న వయసులోనే పెళ్లి... ఆ వెంటనే కుటుంబ సమస్యలు... భర్త కొత్త మార్గంలో వెళతానంటే తోడు నిలిచింది. కొంత నిలదొక్కుకున్నాక సొంత వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడది మూడు కోట్ల వార్షిక టర్నోవర్ను సాధించడంతోపాటు ఎంతోమందికి ఉపాధినీ ఇస్తోంది. పట్టు పరిశ్రమను స్థాపించి, ఒడుదొడుకులను దాటుకొని సాగుతోన్న గంజి అరుణ విజయగాథ ఆమె మాటల్లోనే...తరువాయి

Gully Girl: ‘మేరా టైమ్ ఆయేగా’ అంటూ..!
మీరు ‘గల్లీ బాయ్’ సినిమా చూశారా? మురికివాడలో పుట్టిపెరిగిన ఓ కుర్రాడు ర్యాపర్గా రాణించాలని ఆశపడతాడు. ఎవరేమన్నా, చుట్టూ ఉన్న వాళ్లు నిరుత్సాహపరిచినా తన లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టడు. ఆఖరికి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అనుకున్నది సాధిస్తాడు. ముంబయిలోని ఓ మురికి వాడకు చెందిన సానియా మిస్త్రీ జీవితం కూడా అచ్చం ఇదే సినిమాను పోలి ఉంటుంది.తరువాయి

అందుకే పిల్లలందరికీ తన పుస్తకాలంటే ఎంతో ఇష్టం!
‘వంద భావాలను, వెయ్యి ఆలోచనల్ని ఒక చిత్రంతో చెప్పచ్చ’న్నట్లు.. ఇలాంటి బొమ్మలే పిల్లలకు చదువుపై ఆసక్తిని మరింతగా పెంచుతాయంటున్నారు ముంబయికి చెందిన రచయిత, ఇలస్ట్రేటర్ దీపా బల్సావర్. చిన్నవయసు నుంచే పదాలు, బొమ్మలపై ప్రేమ పెంచుకున్న ఆమె.. అందులోనే తన కెరీర్ను వెతుక్కున్నారు. పలు కార్టూన్ క్యారక్టర్లను సృష్టించి పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఇలస్ట్రేషన్ పుస్తకాలు రాశారు. పాఠ్యాంశాలనూ బొమ్మల రూపంలో అందించేందుకు UNICEFతో కలిసి పనిచేశారామె.తరువాయి

త్రివిక్రముడి సహచర్యంలో.. నృత్య 'సౌజన్యం'!
మన తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకనిర్మాతల భార్యలు కెమెరా ముందుకు రావడమే అరుదు! అయితే సెలబ్రిటీ స్టేటస్తో సంబంధం లేకుండా.. తమదైన ట్యాలెంట్తో గుర్తింపు సంపాదించాలనుకునే స్టార్ వైవ్స్ లేకపోలేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య కూడా ఇందుకు మినహాయింపు కాదు.
తరువాయి

తెల్లజుట్టుతో పెళ్లిపీటలెక్కింది!
తల్లో ఒక్క తెల్లవెంట్రుక కనిపించగానే తల్లడిల్లిపోతాం. డై వేసేస్తాం. మామూలప్పుడు కాస్త బద్ధకించినా ఫంక్షన్ అంటే మరింత అందంగా ముస్తాబవుతాం. అలాంటిది పెళ్లి, పెళ్లికూతురూ మనమే అన్నప్పుడు ఇంకెంత దృష్టిపెడతాం? కానీ ఒకమ్మాయి తెల్ల వెంట్రుకలతోనే పెళ్లిపీటల మీదకెక్కి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.తరువాయి

Ima Keithel: అందుకే ఆసియాలోనే ఈ మార్కెట్కి అంత పేరు!
అదో పెద్ద సంత.. అక్కడ దొరకని వస్తువంటూ లేదు.. ఒక్కసారి ఆ మార్కెట్లోకి అడుగుపెట్టారంటే కాయగూరల దగ్గర్నుంచి ఇంటి అలంకరణ వస్తువుల దాకా కావాల్సినవన్నీ ఒకేసారి ఇంటికి తెచ్చేసుకోవచ్చు. అయినా అందులో ప్రత్యేకత ఏముంది? ప్రస్తుతం ఇలాంటి మార్కెట్లు చాలా చోట్ల వెలిశాయి కదా.. అంటారా? కావచ్చు.. కానీ మహిళలు మాత్రమే విక్రేతలుగా ఉన్న మార్కెట్ను మీరెక్కడా చూసుండరు.. ఒక్క మణిపూర్ రాజధాని ఇంఫాల్లో తప్ప!తరువాయి

గ్రామీణ వ్యాపారవేత్తలని తయారుచేస్తున్నా!
ఐటీ సంస్థలో పని చేసిన అనుభవాన్ని గ్రామీణ ప్రజలకు చేరువ చేయాలనుకున్నారు బెంగళూరుకు చెందిన సుధా శ్రీనివాసన్. ‘ది నడ్జ్ ఫౌండేషన్’ స్థాపించి గ్రామీణ వ్యాపారవేత్తలని తయారు చేస్తున్నారామె... ఐటీ రంగంలో 17 ఏళ్ల అనుభవం సుధా శ్రీనివాసన్ది. 12ఏళ్లు ఇంటెల్ సంస్థలో విధులు నిర్వహించారామె.తరువాయి

గూగుల్లో వెతికి నేర్చుకున్నా!
జీవితంలో ముందుకు నడిపించేందుకు కష్టాలను మించిన గొప్ప గురువు ఎవరుంటారు? తల్లిలేదు... కూలిపని చేసి చదువుకోవాల్సిన పరిస్థితి... అడుగడుగునా ఎదురైన కష్టాల నడుమనే ఎంబీఏ చేసి వ్యాపారవేత్తగా స్థిరపడ్డారామె. తోటి మహిళలకూ ఉపాధిబాట చూపిస్తున్నారు. ఆమే.. గుంటూరుకు చెందిన వెలగపూడి కృష్ణకుమారి..తల్లిలేని బాల్యం ఏ ఆడపిల్లకయినా చేదుగానే ఉంటుంది. కృష్ణకుమారి పరిస్థితి కూడా అదే. ఐదేళ్ల వయసులో అనారోగ్యం కారణంగా తల్లి నిర్మలని కోల్పోయారామె. తండ్రి పకీరయ్య రైతు. స్వస్థలం గుంటూరు,...తరువాయి

తనలానే అందరూ గెలవాలని!
ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా ఉండటం ఆమె తత్వం. చిన్న అనారోగ్యమూ ఎరగని ఆమెకు క్యాన్సర్ అని తేలింది. ఇంట్లోవాళ్లందరూ భయపడినా.. తను మాత్రం దానికి తలవొంచద్దనుకుంది. ఆంచల్ శర్మ.. ఆ తీరుతో దాన్ని ఓడించడమే కాకుండా ఇప్పుడు ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. ఆంచల్ది దిల్లీ. అది 2017.. తమ్ముడి పెళ్లి సంబరాల్లో మునిగిపోయిందామె. ఒక్కసారిగా చేయి నొప్పి. పెళ్లి పనులు కారణమనుకుంది...తరువాయి

Leena Nair: కొల్హాపూర్ నుంచి ఆ కంపెనీ సీఈవో దాకా!
‘ఏదో ఒక కోర్సు తీసుకున్నామా? చదివామా? అన్నట్లుగా కాకుండా మన చదువు మన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఉపయోగపడాలి.. మనలోని ప్రత్యేకతల్ని తట్టి లేపాలి..’ నాడు ప్రొఫెసర్ చెప్పిన ఈ మాటల్నే స్ఫూర్తిగా తీసుకుంది లీనా నాయర్. ఇంజినీరింగ్లో పైచదువులు చదవాలన్న తన ఆలోచనను మార్చుకొని మేనేజ్మెంట్ వైపు అడుగులు వేసింది.తరువాయి

అరటి పిండితో ఆరోగ్యం... ఉపాధి!
అరటిపండ్లు ఈ రోజు తెస్తే... సాయంత్రానికే ముగ్గి పోతాయి. తినకపోతే ఇక పారేయాల్సిందే! మరి అరటిరైతుల మాటేంటి? డిమాండ్ లేని రోజుల్లో పంటని అయినకాడికి అమ్ముకోవడమో... లేదంటే మనలా పారేయడమో చేయాల్సిందేనా? ఈ ఆలోచనతోనే వృథాని అరికట్టి.. ఉపాధి పొందే మార్గాన్ని కనిపెట్టారు కర్ణాటక మహిళలు..తరువాయి

తనను తాను నమ్ముకుంది.. ‘విశ్వా’న్ని గెలిచింది!
‘నమ్మకం అనేది కనిపించదు.. దాన్ని ఫీలవ్వాలి.. దాన్ని నమ్ముకున్న వాళ్లకు తిరుగనేదే ఉండదు..’ అంటోంది కొత్త విశ్వ సుందరి హర్నాజ్ సంధు. ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’కి నిలువెత్తు రూపంగా నిలుస్తోన్న ఆమె.. తన అందంతో, అంతకుమించిన తెలివైన సమాధానాలతో అందరినీ కట్టిపడేసింది. ఫలితంగా 21 ఏళ్ల తర్వాత దేశానికి ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని తెచ్చిపెట్టింది.తరువాయి

అవగాహనే.. ఆమె ఆయుధం
ప్రేమ పేరుతో నమ్మి మోసపోయిందో అమ్మాయి. ఇంకొకామె.. స్నేహితుల ప్రోత్సాహంతో మత్తుకు బానిసైంది. కట్టుకుంటాడని నమ్మి సర్వస్వం అర్పిస్తే దాన్ని బయటపెడతానంటూ బ్లాక్మెయిల్.. ఇలాంటి ఎందరికో సాయమందిస్తున్నారు మాధవీ గణపతి. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, నైతికత నింపాలనుకుని కౌన్సెలర్ అయ్యారీమె.తరువాయి

డిస్నీకి తొలి అధినేత్రి
ప్రపంచ ప్రఖ్యాత ‘ద వాల్ట్ డిస్నీ’ సంస్థ ఛైర్మన్ పదవిని తొలిసారి ఓ మహిళ చేపట్టనున్నారు. 98 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ వినోద దిగ్గజ సంస్థలో ఈ స్థానానికి ఎంపికయ్యారు 67 ఏళ్ల సూసన్ అర్నాల్డ్. అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థాపించిన ఈ సంస్థ ఫిల్మ్ ప్రొడక్షన్, టెలివిజన్, థీం పార్కులుతరువాయి

ముత్యాల పంట పండిస్తోంది...
ఒకటీ రెండూ కాదు.. 20 ఏళ్లుగా ముత్యాలను పండిస్తోందీమె. తను లాభాలు ఆర్జించడమే కాకుండా మరెన్నో వేల మందికీ శిక్షణ ఇస్తోంది. తద్వారా ఎందరికో ఉపాధి కల్పిస్తోంది. ఈ సేద్యానికి అవసరమయ్యే పరికరాలు, కొత్త నైపుణ్యాలను కనిపెడుతూ పలు పురస్కారాలనూ దక్కించుకున్న కుల్జానా దుబే స్ఫూర్తి కథనమిది.తరువాయి

ఆ ఆసక్తే ఆమెను అందలమెక్కించింది!
ఆ అమ్మాయికి అర్థశాస్త్రమంటే ఎంతో మక్కువ. ఆ ఆసక్తితోనే అందులో ఉన్నత చదువులు చదివింది. తన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు-రివార్డులు అందుకుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్గా కెరీర్ ప్రారంభించి.. ప్రొఫెసర్ స్థాయికి ఎదిగింది. ప్రఖ్యాత ఆర్థికవేత్తగా మరెన్నో కీలక పదవుల్లోనూ కొనసాగిన ఆమె.. 2018 నుంచి అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది.తరువాయి

వయసు 85.. పతకాలు 128
మీరు చదివింది నిజమే.. అవన్నీ ఆటల్లో సాధించినవే. పైగా అవేవీ కూర్చుని ఆడేవి కాదు... జావలిన్, డిస్క్, షాట్పుట్ వంటి వాటిల్లో. రన్నింగ్ పోటీల్లోనూ బోలెడు పతకాలు సాధించారీ బామ్మగారు. వయసును జయించిన ఆవిడ పేరు ముత్యం లక్ష్మి. తన క్రీడా ప్రస్థానాన్ని వసుంధరతో పంచుకున్నారు...తరువాయి

రాజీనామా చేసింది.. మళ్లీ గెలిచింది..!
లింగ సమానత్వంలో స్వీడన్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ దేశం మహిళలకు అత్యధికంగా 480 రోజుల మాతృత్వపు సెలవులు ఇస్తోంది.. ఈ దేశ చట్టసభలో 47 శాతం మంది మహిళలే.. లింగ సమానత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే పదో స్థానంలో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే స్వీడన్ మహిళలకు స్వర్గధామం అనడంలో ఎలాంటి సందేహం ఉండదు.తరువాయి

లక్షల అమ్మల బెంగ తీరుస్తోంది
ఉద్యోగినులైన అమ్మలకు పిల్లల గురించే బెంగంతా! ఆఫీసులో ఉన్నా.. స్కూల్లో వాళ్ల క్షేమంపైనే మనసంతా. అందుకే కెరియర్నూ పక్కనపెట్టే వాళ్లెందరో. ఏదైనా సొంతంగా సాధించాలనుకునే సుచరితా దాసిరెడ్డి దీనికో పరిష్కారం చూపాలనుకుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అనుసంధానంగా ఉండేలా ఓ యాప్ను రూపొందించింది.తరువాయి

అందుకే వీళ్లెంతో పవర్ఫుల్!
‘తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ల’న్నట్లుగా మూఢ నమ్మకాలతో సహజీవనం చేసే గ్రామీణ మహిళల్లో చైతన్యం కలిగిస్తోన్న వారు ఒకరు.. తన పోలీస్ పవర్తో నకిలీ వార్తల వ్యవస్థను సమూలంగా అంతమొందించాలని కంకణం కట్టుకున్న వారు మరొకరు.. పెట్టుబడి కోసం కొట్టుమిట్టాడే చిన్న పరిశ్రమలకు రుణాలిస్తూ, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోన్న విశాల హృదయం ఇంకొకరి సొంతం..తరువాయి

టైలరింగ్ వ్యర్థాలతో విభిన్న వస్తువులు తయారుచేస్తోంది!
‘కాదేదీ కళకనర్హం’ అన్నట్లు.. వృథాగా పడేసే మెటీరియల్తోనూ విభిన్న వస్తువులు తయారుచేయచ్చని నిరూపిస్తోంది చెన్నైకి చెందిన నమృతా రామనాథన్. తద్వారా పర్యావరణాన్ని కాపాడడమే కాదు.. వ్యాపారవేత్తగానూ రాణిస్తోంది. వ్యాపారమే తన అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకున్న నమృత.. ఇందుకోసం తన ఉద్యోగాన్ని సైతం వదులుకుంది.తరువాయి

నన్నిలా చూసి ఆయనెక్కడున్నా సంతోషిస్తారు!
దేశ రక్షణ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడతారు వీర సైనికులు. ఆ వీరుల్ని కట్టుకున్న భార్యలు కూడా అంతే గుండె ధైర్యాన్ని, నిండైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. అందుకే భర్త యుద్ధంలో అమరుడైనా ‘నేను సైతం’ అంటూ అటు భర్త అడుగుజాడల్లో నడవడానికి, ఇటు దేశ రక్షణ బాధ్యతల్ని చేపట్టడానికి సిద్ధపడతారు.తరువాయి

టైల్స్తో.. కోట్లు!
ఎదుగూబొదుగూ లేని ఉద్యోగం... దేనికీ సరిపోని జీతం. అలాంటప్పుడు పరిస్థితులని తిట్టుకుంటూ కూర్చోలేదు జంపన శ్రీదేవి.. మహిళలు ఎక్కువగా అడుగుపెట్టని టైల్స్ తయారీ రంగంలో అడుగుపెట్టి కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నారు. అడుగడుగునా స్ఫూర్తిని నింపే ఆమె కథ మనమూ తెలుసుకుందామా... హిందీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా చేరారు శ్రీదేవి. ఎంత కష్టపడ్డా ఎటూ చాలని జీతం. ఆ జీవితం ఆమెకి నచ్చలేదు....తరువాయి

కష్టంలో తోడున్నారని.. ఆస్తి ఇచ్చేసింది!
ఎవరైనా సాయం చేస్తే ఏం చేస్తాం? కృతజ్ఞతలు చెబుతాం. ఇంకొన్నిసార్లు తిరిగి సాయమందించడమో, నగదు ఇవ్వడమో చేస్తుంటాం. కానీ ఒకామె ఏకంగా తన ఆస్తినే రాసిచ్చేసింది. ఒడిశాలో జరిగిందిది. పూర్తిగా తెలుసుకోవాలనుందా.. చదివేయండి. మినతి పట్నాయక్ది ఒడిశాలో కటక్. భర్త, కూతురు ఇదే తన లోకం. గత ఏడాది భర్త కృష్ణకుమార్కి క్యాన్సర్ అని తేలింది...తరువాయి

తాబేళ్లను సంరక్షిస్తూ ‘ఎర్త్ హీరో’ అయ్యింది!
‘ఒక పని పూర్తి చేసే క్రమంలో ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. కానీ లక్ష్యం గొప్పదైనప్పుడు వీటిని అధిగమించడం పెద్ద విషయం కాదం’టోంది ఉత్తరప్రదేశ్కి చెందిన అరుణిమా సింగ్. పర్యావరణం, జలచరాల సంరక్షణ అంటే ప్రాణం పెట్టే ఆమె.. తన జీవితాన్ని ఇలాంటి సముద్ర జీవుల పరిరక్షణకే అంకితం చేసింది.తరువాయి

దేశం చుట్టిన తల్లీకొడుకులు
కేరళ నుంచి కశ్మీరు వరకు రోడ్డు మార్గం ద్వారా వేల కిలోమీటర్ల దూరాన్ని పదేళ్ల కొడుకుతో కలిసి చుట్టేసిందావిడ. 51 రోజుల్లో 28 రాష్ట్రాల్లో పర్యటించిన 40 ఏళ్ల డాక్టర్ మిత్రా సతీశ్ యాత్రానుభవాలు ఇవీ... కొచ్చి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మిత్రా సతీష్.తరువాయి

Maternity Benefits: ఆ తల్లుల కోసం మూడేళ్లుగా పోరాడుతోంది!
ఏళ్లు గడుస్తోన్నా పిల్లలు పుట్టకపోవడం, సామాజిక స్పృహ.. ఇలా కారణమేదైనా కొంతమంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని అమ్మానాన్నలుగా ఓ మెట్టు పైకెక్కుతుంటారు. అయితే ఇలాంటి చిన్నారులు కొత్త వాతావరణానికి, కుటుంబ సభ్యులకు అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుంది. కానీ ఉద్యోగినుల విషయంలో.. కన్న తల్లులతో పోల్చితే పెంచిన తల్లులకు సమానమైన ప్రసూతి ప్రయోజనాలు దక్కట్లేదనే చెప్పాలి.తరువాయి

ప్రపంచానికి పత్తి పాఠాలు
శాస్త్రవేత్తగా అపార అనుభవం ఆమెది... మరింత సాధించాలి, మరెందరికో తోడ్పడాలన్న తపన ఆమెని అంతర్జాతీయ శాస్త్రవేత్తగా మలిచాయి. ఆఫ్రికా దేశాల్లోని రైతులకు శిక్షణ ఇచ్చి, వారిని పత్తిపంటలో లాభాల బాటపట్టిస్తోన్న సంధ్యాక్రాంతి ఓరుగల్లుకు వచ్చిన సందర్భంగా వసుంధర ఆమెని పలకరించింది... నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో. చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం. అందుకే ఆ రంగానికి సంబంధించిన కోర్సునే చదివా. ..తరువాయి

అంతరిక్షంలో నడిచి చరిత్ర సృష్టించింది..!
నేటి తరం మహిళలు అవరోధాల్ని దాటుతూ తమదైన ప్రతిభతో దూసుకుపోతున్నారు. వివిధ రంగాల్లో రాణిస్తూ తమ శక్తియుక్తుల్ని ప్రపంచానికి చాటుతున్నారు. చైనాకు చెందిన వాంగ్ యాపింగ్ చేసింది కూడా ఇదే! ఇటీవలే ఆరున్నర గంటలపాటు అంతరిక్షంలో నడిచి.. ఈ ఘనత సాధించిన మొదటి చైనా మహిళగా రికార్డులకెక్కింది.తరువాయి

87 ఏళ్ల వయసులో మాస్టర్స్ చేసింది!
అరవై సంవత్సరాలు దాటాయంటే చాలామంది మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా తమ శేష జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, శ్రీలంకకు చెందిన ఓ బామ్మ మాత్రం 87 ఏళ్ల వయసులో ఏకంగా మాస్టర్స్ డిగ్రీనే పూర్తి చేసింది. అంతేకాదు.. ఆ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసిన పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించింది.తరువాయి

అరోమా థెరపీతో.. ఆరోగ్యాన్ని పెంపొందిస్తూ..
తండ్రి కోరిక మేరకు కంప్యూటర్ చదువులు అభ్యసించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడాలనుకున్న క్రమంలో పెళ్లి చేసుకుని అత్తారింట అడుగుపెట్టింది. అప్పుడే అక్కడి మామిడి, చామంతి, గులాబీ, మల్లె తోటలను చూసింది. వాటి ప్రయోజనాలేంటో క్షుణ్ణంగా తెలుసుకుంది. క్రమంగా అరోమా థెరపీపై ఆసక్తి పెంచుకుంది.తరువాయి

కష్టాలకు ఎదురొడ్డి.. నాన్న కల నెరవేర్చింది!
జీవితంలో మనం పడ్డ కష్టాలే మనకు లక్ష్యం మీద కసి పెంచుతాయి. మనల్ని విజయతీరాలకు చేర్చుతాయి. తమిళనాడులోని ఓ మారుమూల గిరిజన ప్రాంతంలో పుట్టిపెరిగిన సంఘవి మునియప్పన్ జీవితం కూడా ఇందుకు మినహాయింపు కాదు. కటిక పేదరికంలో పుట్టిన ఆమె.. పెరిగి పెద్దయ్యే క్రమంలో ఇలాంటి ఎన్నో కష్టాలను చవిచూసింది.తరువాయి

నా ట్రైనింగ్వాళ్లకే ప్రత్యేకం!
‘నువ్వేం శిక్షణనివ్వగలవు?’.. జిమ్ ట్రైనింగ్ ఇస్తానన్నప్పుడు ఫర్జానాకి ఎదురైన ప్రశ్న ఇది. కానీ ఆమె నిరుత్సాహపడలేదు. సొంతంగా ప్రయత్నించింది. ఈసారి బ్లడ్ క్యాన్సర్ అడ్డుపడింది. అయినా ఆగలేదు. దాన్నీ అధిగమించింది. ఇదేమీ తన చిన్నప్పటి కలా కాదు.. కెరియర్ అంతకన్నా కాదు. జీవితంలో జరిగిన ఒక సంఘటన మహిళల కోసంతరువాయి

‘సామీ.. సామీ..’ కోసం ఏడాది ఎదురుచూశా!
మాది కరీంనగర్ జిల్లా కనపర్తి. ఆరో తరగతి వరకు అక్కడే చదివా. తర్వాత జమ్మికుంటలో స్థిరపడ్డాం. డిగ్రీ చేశా. నాన్న మల్లయ్య రైతు. అమ్మ శ్యామల గృహిణి. అక్క పద్మావతి చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడేది. నాన్నకు తెలిసిన ఓ కళాకారుడు అక్క పాట విని బాగుందని మెచ్చుకున్నాడు. మెలకువలతోపాటు వేదికల మీద పాడటం నేర్పించాడు. అక్క పాటలు పాడేందుకు వెళుతుంటే నేనూ వెంట వెళ్లేదాన్ని. క్రమంగా నాకూ ఇష్టం ఏర్పడి.. విమలక్క, గద్దర్ పాటలు వింటూ సాధన చేసేదాన్ని. వేదికలపై పాడే అవకాశం రాక నిరుత్సాహపడ్డా. అమ్మానాన్నలే నాలో ధైర్యం నింపారు.తరువాయి

ఈ ‘కాఫీ లేడీ’ కథేంటో తెలుసా?
‘వ్యాపారం ప్రారంభించాలనుకుంటే సరిపోదు.. అందుకు తగిన పెట్టుబడి మన వద్ద ఉండాలి.. నష్టాలొస్తే తట్టుకునే శక్తిని కూడగట్టుకోవాలి.. అప్పుడే విజయం సాధించగలం’ అంటోంది నాగాలాండ్కి చెందిన జకిత్సోనో జమీర్. ‘కాఫీ లేడీ ఆఫ్ నాగాలాండ్’గా పేరుగాంచిన ఆమె.. ఇప్పుడీ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కృషి చేసింది.తరువాయి

దాతృత్వ లక్ష్ములు
దేశంలోని సంపన్నుల జాబితా చూస్తే దానిలో మహిళలూ ఎక్కువే. అయితే ఆర్జనలోనే కాదు.. దాతృత్వంలోనూ వాళ్లకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారీ నారీమణులు. ఎడెల్గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రపీ 2021 జాబితాలో 9 మంది మహిళలు స్థానం దక్కించుకోగా.. ముంబయికి చెందిన ఈ ముగ్గురూ మొదటి స్థానాల్లో ఉన్నారు. వాళ్ల గురించి..తరువాయి

పాటతో గెలిచి నిలిచింది!
పుట్టిన పదిరోజులకే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు... అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు కొన్నాళ్లు చదువుకి దూరం చేశాయి. అయినా తన ప్రతిభ మాత్రం... ఆ అమ్మాయికి ఎనలేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. గాయనిగా... వందల ఏళ్ల నాటి జానపదాలను సేకరించి కొత్త ఊపిరులూదే శక్తినిచ్చింది. ఆమే నిజామాబాద్కి చెందిన గంగ. ఆమె విజయ ప్రస్థానం సాగిందిలా!తరువాయి

ఇప్పుడు అబ్బాయిలకూ ట్రైనింగ్ ఇస్తుంది!
క్రికెట్లో మగవారితో సమానంగా మహిళలూ రాజ్యమేలుతున్నారు. టెస్టు, వన్డే, టీ20.. ఇలా ఫార్మాట్ ఏదైనా మైదానాన్ని దున్నేస్తూ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నారు. ఇలా తమ ఆటతీరుతో అద్భుతాలు సృష్టిస్తోన్న మహిళా క్రికెటర్లు.. అవకాశమొస్తే ఆటలో ఎలాంటి బాధ్యతలనైనా స్వీకరించేందుకు ‘సై’ అంటున్నారు.తరువాయి

తన కష్టం మరొకరికి రాకూడదని...!
ఇరవైఏళ్లు వచ్చినా అతను పసికందుకిందే లెక్క. అన్నీ దగ్గరుండి చూసుకోవాల్సిందే మరి. అందుకోసం ఆ అమ్మ ప్రభుత్వ ఉద్యోగాన్నే పణంగా పెట్టారు. అంతేకాదు తనలాంటి మరెందరో తల్లులకు ఊరటనివ్వడం కోసం ఓ సంస్థని స్థాపించారావిడ. భర్త, పిల్లలను కూడా సేవలో నిమగ్నం చేశారు ఖమ్మం జిల్లాకు చెందిన నల్లగట్టు ప్రమీల...తరువాయి

రీతూ.. ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగులేని బ్రాండ్!
అంతరించిపోతున్న భారతీయ హస్తకళలకు ప్రాణం పోసి, ఆ కళాకారులకు ఉపాధి కల్పించి, వారి పొట్ట నింపిన ఘనత భారతీయ ఫ్యాషన్ క్వీన్ రీతూ కుమార్కే దక్కుతుంది. దేశంలో ఓ ఫ్యాషన్ ప్రపంచాన్నే సృష్టించి.. హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్తో వస్త్రాలకు సరికొత్త హంగులద్దిన ఆమె.. భారతీయ వస్త్రకళలను తన ఆరోప్రాణంగా భావించారు.తరువాయి

ఆమె... డాక్టర్ క్యుటరస్
మీ స్నేహితురాలిని ఆర్గాసమ్ గురించి ఎప్పుడైనా ప్రశ్నించండి... మీ ప్రశ్న పూర్తికాక ముందే ‘దయచేసి టాపిక్ మారుస్తావా?’ అనేవాళ్లే ఎక్కువ. ఎవరూ మాట్లాడుకోవడానికి ఇష్టపడని ఈ అంశాలపై అవగాహన తీసుకొస్తోంది డాక్టర్ తాన్యా నరేంద్ర ఉరఫ్ ‘డాక్టర్ క్యుటరస్’. ప్రతిష్ఠాత్మక రాయల్ సొసైటీలో సభ్యురాలైన ఈ డాక్టరమ్మ చెబుతున్న ఆసక్తికరమైన విషయాలేంటో మనమూ తెలుసుకుందాం...తరువాయి

అంతర్జాతీయ వేదికలపై... ఆదిమ గిరిజన యువతి
అర్చనది ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లా బిహాబంద్ గ్రామం. ఖడియా తెగలో జన్మించిన ఈమె తాత ఒకప్పుడు అడవుల సంరక్షణ బృందాలకు మార్గదర్శకుడు. నాన్న గిరిజనులకు వైద్యం చేసేవాడు. ఈమె కూడా చిన్నప్పటినుంచీ వాళ్ల బాటలో నడవడం మొదలుపెట్టింది. పట్నా మహిళా కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్లో డిగ్రీ, ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి మాస్టర్స్ చేసిందితరువాయి

‘జల’ దేవతగా భావించి గెలిపించారు!
ఎన్నికల ప్రచారంలో హామీలివ్వడం.. గెలిచాక వాటి గురించి మర్చిపోవడం రాజకీయ నాయకులకు అలవాటే! అయితే చదువుకున్న యువత రాజకీయాల్లోకొస్తే ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందంటోంది ఆర్ షారుకళ. తమిళనాడులోని స్థానిక ఎన్నికల్లో అతి పిన్న పంచాయతీ ప్రెసిడెంట్గా తాజాగా గెలుపొందిందీ 23 ఏళ్ల అమ్మాయి.తరువాయి

ఈమెది మానసిక భరోసా
ఎవరి సాయమైనా పొందితే ఏం చేస్తాం? కృతజ్ఞతలు చెబుతాం. ఇంట్లో ఏదైనా శుభకార్యాలుంటే గుర్తుంచుకుని వాళ్లని పిలుస్తాం. అవునా! అయితే ఆమెకు థాంక్స్ మాత్రం చెప్పి శుభకార్యాలు, పెళ్లిళ్లకు రావొద్దనే వాళ్లు. దేశంలోనే మొదటి మహిళా సైకియాట్రిస్ట్.. డాక్టర్ శారదా మేనన్కి ఇలాంటి అనుభవాలెన్నో!తరువాయి

ఆశయం కోసం తన సంస్థనే అమ్మేసింది
కొనడం.. అమ్మడం మాత్రమే తెలిసిన వ్యాపారవేత్తలకు మనసు కూడా ఉంటుందా? ఉంటుందనే నిరూపించింది 72 ఏళ్ల జయశ్రీరావు. గ్రామీణుల కష్టాలని చూసి చలించిన ఆమె వాళ్లకు సాయం చేయడానికి సొంత సంస్థనే అమ్మేసింది. ఆ త్యాగం ఈ రోజు లక్షలమంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మహారాష్ట్రలోని 200 గ్రామాల ప్రజలకు మేలు చేసిన ఆమె స్ఫూర్తి కథనమిది..తరువాయి

‘లోకనాయకుడి’ని స్టైలిష్గా చూపిస్తోంది!
తెలుగులో మాదిరిగానే తమిళంలో కూడా బిగ్బాస్ ఐదో సీజన్ ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైంది. తమిళ బుల్లితెరతో పాటు వెండితెరపై సత్తా చాటుతోన్న మొత్తం 18 మంది నటీనటులు, సింగర్లు, యాంకర్లు బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. అయితే వీరందరి కన్నా కమలే ఈ గ్రాండ్ ప్రీమియర్ షోలో ప్రత్యేకాకర్షణగా నిలిచారు.తరువాయి

దేశాధ్యక్షుణ్నే ఢీ కొట్టింది!
యుద్ధభూములు... ఉగ్రవాద అడ్డాలు... ఆమెను అడ్డుకోలేకపోయాయి.. తమ దేశాధ్యక్షుడి అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తూ ‘ఢీ... అంటే ఢీ’ అంటూ 58 ఏళ్ల మారియారెస్సా చేస్తున్న అక్షర సమరం అవినీతికి వ్యతిరేకంగా కోట్ల మందికి పిడికిళ్లు బిగించే శక్తిని అందించింది. నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న ఈ ఫిలిప్పీన్స్ పాత్రికేయ యోధురాలి పోరాట గాథ ఇది... ఫిలిప్పీన్స్లో ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో ఎంతమందికి తెలుసో... జర్నలిస్టు మారియారెస్సా గురించి కూడా అంతమందికీ తెలుసు.తరువాయి