బ్రేకింగ్

breaking
28 Mar 2024 | 23:27 IST

ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌ విజయం

జైపుర్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో రాజస్థాన్‌కు వరుసగా రెండో విజయం. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 12 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ (84: 45 బంతుల్లో) విశ్వరూపం చూపాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (49), స్టబ్స్‌ (44*) చెలరేగి ఆడారు. రాజస్థాన్‌ బౌలర్లలో బర్గర్‌, చాహల్‌ తలో రెండు వికెట్లు తీశారు. 

మరిన్ని

తాజా వార్తలు