బ్రేకింగ్

breaking
17 Jan 2024 | 16:45 IST

TS: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!

హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఇద్దరు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖరారు చేసింది. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌లను ఎంపిక చేసినట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. నామినేషన్లు దాఖలు చేయడానికి గురువారం (ఈ నెల 18) వరకూ గడువు ఉంది. రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి విడివిడిగా నిర్వహించనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంఖ్యాబలం ఉన్నందువల్ల రెండు స్థానాలనూ గెలిచేందుకు అవకాశముంది.

మరిన్ని

తాజా వార్తలు