బ్రేకింగ్

breaking
07 May 2024 | 12:42 IST

వివేకా హత్య.. రూ.40కోట్లు చేతులు మారాయి: షర్మిల

కడప: వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్‌ ఎందుకు మౌనం వహించారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. వైఎస్సార్‌ జిల్లా కమలాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ‘‘వివేకా హత్య జరిగిన రోజు ఎవరు చంపారో మాకు కూడా తెలియదు. సీబీఐ సాక్ష్యాలు, ఆధారాలను సేకరించాకే అవినాష్‌ హస్తం ఉందని తెలిసింది. ఆయన ఎవరెవరితో మాట్లాడారో ఫోన్‌రికార్డులు స్పష్టం చేశాయి. రూ.40 కోట్లు డబ్బులు చేతులు మారాయని ఆధారాలున్నాయి. ఇన్ని సాక్ష్యాలున్నా ఐదేళ్లుగా అవినాష్‌పై ఒక్క చేయి కూడా పడలేదెందుకు?’’ అని షర్మిల ప్రశ్నించారు.

మరిన్ని

తాజా వార్తలు