బ్రేకింగ్

breaking
21 Mar 2023 | 18:53 IST

రాణించిన యస్తికా,హేలీ.. ముంబయి విజయం

ముంబయి: మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 126 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు 16.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబయి బ్యాటర్లు హేలీ మ్యాథ్యూస్‌ (24), యస్తికా భాటియా (30) కలిసి తొలి వికెట్‌కు 53 పరుగుల పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో అమేలియా (31*) అద్భుత ఆట తీరుతో జట్టుకు విజయాన్ని అందించింది. ఆర్సీబీ బౌలర్లలో కనికా అహుజా 2, మేఘన్‌, శ్రేయాంక పాటిల్‌, ఎల్లీస్‌ పెర్రీ, ఆశా శోభన, ఒక్కో వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు