బ్రేకింగ్

breaking
30 Mar 2023 | 17:52 IST

ఎవరొస్తారో రండి.. దమ్ముంటే తరిమికొట్టండి: MLA సవాల్‌

నెల్లూరు: తనకు వ్యతిరేకంగా ర్యాలీ తీసి ‘పార్టీ ద్రోహి ఎమ్మెల్యే.. మా నియోజకవర్గం నుంచి వెళ్లిపో’ అని నినాదాలు చేసిన వారిపై ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాను వస్తే తరుముతామని అన్న వాళ్లు రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. ఉదయగిరిలోని బస్టాండు సెంటర్‌ వద్ద ఆయన  కుర్చీ వేసుకొని కూర్చొన్నారు. తర్వాత ఆ సెంటర్‌లో కలియతిరిగారు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. అయినా పార్టీ అధిష్ఠానం నాపై అభాండాలు వేసి సస్పెండ్‌ చేసింది. పార్టీలో లేనని చెప్పి నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు ఆదరించబట్టే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఇప్పుడు ఎవరొస్తారో రండి.. దమ్ముంటే తరిమికొట్టండి’’ అని సవాల్‌ విసిరారు.

మరిన్ని

తాజా వార్తలు