బ్రేకింగ్

breaking
07 May 2024 | 12:22 IST

బనగానపల్లిలో తెదేపా, వైకాపా వర్గాల ఘర్షణ

బనగానపల్లె: తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణతో నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలోని సంతమార్కెట్‌లో వైకాపా, తెదేపా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. తొలుత వైకాపా ప్రచారం ముగియగా.. ఆ తర్వాత తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి సతీమణి ఇందిరమ్మ తమ పార్టీ నేతలతో అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో తెదేపా నాయకులు దాడి చేశారని కొంతమంది వైకాపా కార్యకర్తలు చెప్పడంతో ఆ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబుల్‌రెడ్డి వాహనాలతో మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

మరిన్ని

తాజా వార్తలు