బ్రేకింగ్

breaking
09 May 2024 | 23:41 IST

పంజాబ్‌ను చిత్తుచేసిన బెంగళూరు

ధర్మశాల: పంజాబ్‌తో జరిగిన పోరులో బెంగళూరు అదరగొట్టింది. 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 242 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ 17 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో రిలీ రోసో (61) అర్ధశతకంతో చెలరేగాడు. శశాంక్‌ (37), బెయిర్‌ స్టో (27), సామ్‌ కరన్‌ (22) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో కర్ణ్‌ శర్మ 2, స్వప్నిల్‌ సింగ్‌ 2, ఫెర్గూసన్‌ 2, సిరాజ్‌ 3 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. కోహ్లీ (92), రజత్‌ పటీదార్‌ (55), గ్రీన్‌ (46) చెలరేగి ఆడారు. పంజాబ్‌ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 3, కావేరప్ప 2, అర్ష్‌దీప్‌ సింగ్‌, సామ్‌ కరన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.    

మరిన్ని

తాజా వార్తలు