బ్రేకింగ్

breaking
05 May 2024 | 13:27 IST

ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటా: సీఎం రేవంత్‌

నిర్మల్‌: ఆదిలాబాద్‌ అంటే ప్రత్యేక అభిమానమని, అందుకే దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత తనదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నిర్మల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐ పరిశ్రమను తెరిపిస్తాం. ఈ నెల 9వ తేదీలోపు రైతుభరోసా నిధులు ఖాతాల్లో జమ చేస్తాం. పంద్రాగస్టు లోపు ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 5 అమలు చేశాం. తెలంగాణకు భాజపా గాడిద గుడ్డు ఇచ్చింది’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

మరిన్ని

తాజా వార్తలు