బ్రేకింగ్

breaking
05 May 2024 | 16:30 IST

తెలంగాణ ఉద్యమం అయిపోలేదు: కేసీఆర్‌

వీణవంక: తెలంగాణ ఉద్యమం అయిపోలేదని, ఇంకా ఉందని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందన్నారు. కరీంనగర్‌ జిల్లా వీణవంకలో ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. ‘‘ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారంలోకి వచ్చేది భారాస ప్రభుత్వమే. నాలుగు నెల్లలోనే తెలంగాణ తారుమారయ్యింది. గోదావరిని తీసుకెళ్లి కర్ణాటక, తమిళనాడుకు ఇస్తానని మోదీ అంటున్నారు. దీనిపై రేవంత్‌ ఏమీ మాట్లాడటం లేదు. రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ చెన్నైకి వెళ్లిపోయింది. అనేక సంస్థలు హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోవాలని యోచిస్తున్నాయి’’ అని కేసీఆర్‌ అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు