బ్రేకింగ్

breaking
08 May 2024 | 10:04 IST

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసులు రద్దు!

దిల్లీ: దేశవ్యాప్తంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలు రద్దు అయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి ఇప్పటివరకు 70కి పైగా విమాన సర్వీసులు రద్దు చేశారు. ఆ సంస్థకు చెందిన సుమారు 300 మందికి పైగా సిబ్బంది సిక్‌ లీవ్‌లు పెట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీరంతా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ విధానాలను ఖండిస్తూ నిరసనగా సెలవు పెట్టినట్లు సమాచారం. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రకటించింది.

మరిన్ని

తాజా వార్తలు