బ్రేకింగ్

breaking
27 Apr 2024 | 21:17 IST

రాహుల్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌.. రాజస్థాన్‌ లక్ష్యం 197

లఖ్‌నవూ: రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (76; 48 బంతుల్లో 8×4, 2×6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. హుడా (50; 31 బంతుల్లో 7×4) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. డికాక్‌ (8), స్టాయినిస్‌ (0), పూరన్‌ (11) నిరాశపరిచారు. చివర్లో బదోని (18*) కృనాల్‌ (15*) రాణించారు. బౌలర్లలో సందీప్‌ శర్మ 2 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్‌, అవేశ్‌ఖాన్‌, అశ్విన్‌ తలో వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు