బ్రేకింగ్

breaking
10 May 2024 | 11:10 IST

అవినీతి చేయాల్సి వస్తే రాజకీయాలు వదిలేస్తా: అర్వింద్‌

వేల్పూరు: ఐదేళ్లలో ఎంపీగా తనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదని భాజపా ఎంపీ అర్వింద్‌ అన్నారు. తనకంటే ముందు ఎంపీగా ఉన్న కవిత జైలులో ఉన్నారని చెప్పారు. నిజామాబాద్‌ జిల్లాలోని వేల్పూరులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అవినీతి చేసే రోజు వస్తే రాజకీయాలు వదిలేస్తా తప్ప.. తప్పు చేయను. ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది. ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుకుంటే ప్రభుత్వం పడిపోతుంది’’ అని అర్వింద్‌ తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు