బ్రేకింగ్

breaking
10 May 2024 | 12:00 IST

ఏపీలో అక్రమ ఇసుక త‌వ్వకాలను నిలిపివేయాలి: సుప్రీం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ ఇసుక త‌వ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే మైనింగ్‌ జరిగే ప్రదేశానికి వెళ్లి ఆపాలని చెప్పింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మీ చర్యలు అన్ని కాగితాలపైనే ఉన్నాయని, క్షేత్రస్థాయిలో కనిపించవు అని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని

తాజా వార్తలు