బ్రేకింగ్

breaking
10 May 2024 | 12:58 IST

మీ భూములు కొట్టేయడానికి జగన్‌ సిద్ధమయ్యాడు: చంద్రబాబు

ఉండి: రాష్ట్రాన్ని పాలించేది అహంకారి, దోపిడీదారి, సైకో అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రశ్నించినందుకు హింసించారని ఆరోపించారు. మట్టి, ఆస్తులు కొట్టేసిన ఘనుడు.. జగన్‌ అని ధ్వజమెత్తారు. మద్యంతో వేల కోట్ల రూపాయలు దోచేశారన్నారు. ప్రజల భూములు కొట్టేయడానికి జగన్‌ సిద్ధమయ్యాడని ఆరోపించారు. ఫ్యానుకు, వైకాపాకు ఉరేయాలన్నారు. జగన్‌ పోలవరం పూర్తి చేయలేదని.. ఆయనకు ఓటు అడిగే హక్కు లేదని చంద్రబాబు చెప్పారు.

మరిన్ని

తాజా వార్తలు