బ్రేకింగ్

breaking
05 May 2024 | 14:00 IST

రాబోయేది ఎన్డీయే.. మళ్లీ ప్రధాని మోదీనే: చంద్రబాబు

ధర్మవరం: దేశంలో రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనే అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. ధర్మవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘‘అమరావతిని నాశనం చేసిన జగన్‌ను ఇంటికి పంపాల్సిందే. మూడు రాజధానుల పేరుతో అసలు రాజధానే లేకుండా చేశారు. మా పార్టీ అధికారంలోకి వచ్చాక అమరావతిని దేశంలోనే నెంబర్‌ వన్‌ రాజధానిగా చేస్తాం. పోలవరం పూర్తి చేసి.. హంద్రీనీవాతో అనంతపురంలో ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం. జగన్‌ ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు’’ అని చంద్రబాబు తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు