బ్రేకింగ్

breaking
27 Sep 2022 | 22:00 IST

తెరాస ఎమ్మెల్యేను 9గంటల పాటు విచారించిన ఈడీ

హైదరాబాద్: ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై ఇబ్రహీంపట్నం తెరాస ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిన్న మంచిరెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరైన ఎమ్మెల్యేను ఈడీ అధికారులు దాదాపు 9గంటల పాటు ప్రశ్నించి వివరాలు రాబట్టారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించినట్టు సమాచారం.

మరిన్ని

తాజా వార్తలు