బ్రేకింగ్

breaking
04 Feb 2023 | 14:36 IST

మాది కుటుంబపాలనే.. 4కోట్ల మంది మా కుటుంబం: KTR

హైదరాబాద్‌: దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా ఉందని మంత్రి కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. సమీకృత, సమ్మిళిత, సమగ్రాభివృద్ధికి దిక్సూచిగా నిలిచిందన్నారు. అసెంబ్లీలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ఏ రంగాన్ని కూడా విస్మరించకుండా అభివృద్ధి చేస్తున్నాం. దేశం కడుపు నింపే స్థాయికి రాష్ట్రం ఎదిగింది. సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తిరుగులేదు. దేశ ప్రజల చూపు కేసీఆర్‌ వైపు ఉంది. తెలంగాణతో కేసీఆర్‌కు ఉన్న బంధాన్ని ఎవరూ విడదీయలేరు. మా ప్రభుత్వం కుటుంబపాలనే.. 4కోట్లమంది మా కుటుంబం’’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

మరిన్ని

తాజా వార్తలు