బ్రేకింగ్

breaking
05 May 2024 | 13:15 IST

ఏపీలో గూండాగిరి అంతానికే కూటమి: అమిత్‌షా

ధర్మవరం: లోక్‌సభ ఎన్నికల మొదటి రెండు దశల్లోనే మోదీ సెంచరీ కొడతారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. తర్వాతి దశల్లో మొత్తం 400కుపైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ధర్మవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఆంధ్రాలో గూండాగిరిని అంతం చేసేందుకు కూటమిగా ఏర్పడ్డాం. ఇక్కడి అవినీతి ప్రభుత్వాన్ని దించడానికి, భూ మాఫియాను అరికట్టడానికి, అమరావతిని మళ్లీ రాజధానిగా చేయడానికే చేతులు కలిపాం. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ సర్కారు వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం’’ అని అమిత్‌షా తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు