బ్రేకింగ్

breaking
28 Jun 2022 | 10:38 IST

వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

ముంబయి: షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ ఛైర్మన్‌ పల్లోంజీ మిస్త్రీ(93) కన్నుమూశారు. ముంబయిలోని ఆయన నివాసంలో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో పల్లోంజీ చేసిన కృషికి 2016లో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కరించింది. ముంబయికి చెందిన షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ను 156 ఏళ్ల క్రితం స్థాపించారు. ఇప్పుడు ఆఫ్రికా, భారత్‌, మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా దేశాల్లో ఈ నిర్మాణ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయ భవనం, హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్ భవనాలు కూడా షాపూర్‌జీ పల్లోంజీనే నిర్మిస్తోంది.

మరిన్ని

తాజా వార్తలు