బ్రేకింగ్

breaking
29 Nov 2022 | 16:05 IST

త్వరలోనే 3 రాజధానులపై బిల్లు: సజ్జల

అమరావతి: రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సజ్జల మాట్లాడుతూ.. ‘‘రాజధానిపై ప్రభుత్వ వైఖరి మేరకే సుప్రీం నిర్ణయం ఉందని భావిస్తున్నాం.  గతంలో 3 రాజధానులపై తీసుకొచ్చిన బిల్లును వెనక్కి తీసుకున్నాం. లేని చట్టంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది. 3రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇవాళ్టికి రాష్ట్ర రాజధాని అమరావతే. త్వరలోనే న్యాయ ప్రక్రియకు లోబడి 3 రాజధానులపై బిల్లు తీసుకొస్తాం’’ అని అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని