బ్రేకింగ్

breaking
21 Mar 2023 | 22:46 IST

WPL: యూపీ ఓటమి.. ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్‌

ముంబయి: మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో లీగ్‌ దశ ముగిసింది. యూపీ వారియర్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో దిల్లీ 5 వికెట్ల తేడాదో విజయం సాధించింది. యూపీ వారియర్స్‌ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ జట్టు 17.5 ఓవర్లలో ఛేదించింది. దిల్లీ బ్యాటర్లలో మెగ్‌లానింగ్‌ (39), అలీస్‌ క్యాప్సే (34), మారిజన్నె (34*) రాణించారు. యూపీ బౌలర్లలో షబ్నిమ్‌ 2 వికెట్లు పడగొట్టగా, యషశ్రీ, సోఫి ఒక వికెట్‌ తీశారు. తాజా విజయంతో దిల్లీ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ప్లేఆఫ్‌లో గెలిచిన జట్టుతో దిల్లీ ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడుతుంది.

మరిన్ని

తాజా వార్తలు