బ్రేకింగ్

breaking
07 Aug 2022 | 14:46 IST

నీతిఆయోగ్‌కు రాజకీయ రంగు: హరీశ్‌రావు

హైదరాబాద్‌: భాజపాకు వంతపాడుతూ నీతిఆయోగ్‌ నోట్‌ రిలీజ్‌ చేయడం సిగ్గుచేటని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నీతిఆయోగ్‌ చెప్పినా కేంద్రం నిధులివ్వలేదు. నిధులు ఇచ్చినా వాడుకోలేదని నీతిఆయోగ్‌ తప్పుడు ప్రకటన చేసింది. నీతిఆయోగ్‌ పూర్తిగా వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోంది. సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి తప్పుడు ప్రకటన చేశారు. నీతిఆయోగ్‌ రాజకీయ రంగు పులుముకుంది’ అని హరీశ్‌రావు ఆరోపించారు.

మరిన్ని

తాజా వార్తలు