బ్రేకింగ్

breaking
10 May 2024 | 16:18 IST

తాడేపల్లిలో పెద్ద సైకో.. గన్నవరంలో పిల్ల సైకో!

గన్నవరం: తాడేపల్లిలో పెద్ద సైకో.. గన్నవరంలో పిల్ల సైకో ఉన్నారని జగన్‌, వల్లభనేని వంశీలను ఉద్దేశించి తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించిన బహిరంగ సభలో వర్షంలో తడుస్తూనే ఆయన ప్రసంగం కొనసాగించారు.‘‘ రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేస్తాం. గన్నవరం తెదేపాకు కంచుకోట. 9 సార్లు ఎన్నికలు జరిగితే ఇండిపెండెంట్‌తో కలిసి 8సార్లు విజయం సాధించాం. నవరత్నాల పేరుతో జగన్‌ మోసం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేస్తా. వైకాపా మరోసారి అధికారంలోకి వస్తే మీ భూమి మీది కాదు’’ అని చంద్రబాబు అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు