బ్రేకింగ్

breaking
04 Feb 2023 | 14:41 IST

ప్రముఖ నేపథ్యగాయని వాణీజయరాం కన్నుమూత

చెన్నై: ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఆమె తదిశ్వాస విడిచారు. వాణీజయరాం ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ.. ఇలా 14 భాషల్లో దాదాపు 8వేలకు పైగా పాటలు ఆలపించారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్‌ 30న జన్మించిన ఆమె అసలు పేరు కలైవాణీ. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీజయరాం ఐదో సంతానం. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని

తాజా వార్తలు