బ్రేకింగ్

breaking
01 Apr 2023 | 17:15 IST

రాణించిన రాజపక్స.. కోల్‌కతా టార్గెట్‌ ఫిక్స్‌

మొహాలీ: ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతాతో తలపడుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో భానుక రాజపక్స (50) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోగా.. శిఖర్‌ ధావన్‌ (40) కూడా రాణించాడు. ప్రభ్‌సిమ్రన్ (23), జితేశ్‌ శర్మ (21), సామ్‌ కరన్‌ (26*) కాస్త ఫర్వాలేదనిపించారు. కోల్‌కతా బౌలర్లలో టిమ్‌ సౌథీ 2వికెట్లు తీయగా.. ఉమేశ్‌ యాదవ్‌, సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి తలో వికెట్‌ పడగొట్టారు.

మరిన్ని

తాజా వార్తలు