బ్రేకింగ్

breaking
28 Mar 2024 | 20:22 IST

రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలే నిర్ణయించాలి: చంద్రబాబు

కదిరి: రాయలసీమ కోసం జగన్‌ చేసిందేమీ లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఐదేళ్లలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. కదిరిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచార సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. ‘‘తెదేపా హయాంలో రాయలసీమ కోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేశాం. చెక్‌ డ్యామ్‌లు కట్టాం. బిందు సేద్యానికి 90శాతం రాయితీ ఇచ్చాం. జగన్‌ రూ.2వేల కోట్లే ఖర్చు చేశారు. రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలే నిర్ణయించాలి’’అని అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు