బ్రేకింగ్

breaking
17 Jan 2022 | 21:07 IST

AP: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి మృతి 

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని ఎర్రబాలెం గ్రామంలో కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో శ్రీనివాస్‌, సాయి, నరేంద్రకుమార్‌ మంగళగిరి కొత్తపేటకు చెందినవారు కాగా, మరోవ్యక్తిని ఎర్రబాలెంకు చెందిన తేజగా గుర్తించారు. మండలంలోని కృష్ణాయ పాలెం గ్రామం నుంచి కారులో వస్తుండగా రోడ్డు మలుపు తిరిగే చోట కారు చెరువులోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మరిన్ని

తాజా వార్తలు