బ్రేకింగ్

breaking
01 Apr 2023 | 17:37 IST

ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌.. మెట్రో సర్వీసులు పెంపు

హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియంలో రేపు జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు. రద్దీ దృష్ట్యా నాగోల్‌-అమీర్‌పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అధిక సంఖ్యలో మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య 3.30గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల కోసం నిర్వాహకులు స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

మరిన్ని

తాజా వార్తలు