బ్రేకింగ్

breaking
02 Feb 2023 | 16:31 IST

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. ఈడీ ఛార్జిషీట్‌లో కవిత, కేజ్రీవాల్‌ పేర్లు

దిల్లీ: ‘దిల్లీ మద్యం కుంభకోణం’ కేసు విచారణ దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో జరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.  ఈకేసులో జనవరి 6న 13,657 పేజీల అనుబంధ ఛార్జిషీటును ఈడీ దాఖలు చేసింది. ఇందులో విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌, అమిత్‌ అరోరా పేర్లతో పాటు ఏడు కంపెనీలను చేర్చింది. ఈడీ ఛార్జిషీట్‌లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రమేయం గురించి ప్రస్తావించింది.

మరిన్ని

తాజా వార్తలు