బ్రేకింగ్
17 Jan 2022 | 14:40 IST
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ తేదీ మార్పు
దిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు ఎన్నికల పోలింగ్ తేదీని ఈసీ మార్పు చేసింది. పంజాబ్లో ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్ జరగాల్సి ఉండగా, దానిని 20కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గురు రవిదాస్ జయంతి వేడుకలు ఉన్నందున ఈ తేదీ మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఫిబ్రవరి 16న గురు రవిదాస్ జయంతి ఉండగా, ఉత్సవాలు ముందే ప్రారంభమవుతాయి. పైగా, జయంతి నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు యూపీలోని వారణాసికి వెళ్తారని.. దీంతో ఓటు వేసే అవకాశం కోల్పోతారని పార్టీలు ఈసీకి తెలిపాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
- ర్యాలీలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన వల్లభనేని వంశీ
- పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
- కొడాలి నాని నామినేషన్పై వివాదం.. ఆర్వో నిర్ణయంపై ఉత్కంఠ
- 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
- అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
- ఆరోజే కేఏ పాల్ పార్టీకి టాటా చెప్పా: మాజీ మంత్రి బాబూమోహన్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!