బ్రేకింగ్

breaking
17 Apr 2024 | 21:24 IST

ఇద్దరు నానిలకు మమ్మల్ని తిట్టడమే పని: చంద్రబాబు

మచిలీపట్నం: ప్రజల మేలు కోసమే తాము కూటమి కట్టామని, ప్రజలకు కూడా తమకు అండగా నిలబడాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. మచిలీపట్నంలో నిర్వహించిన ‘ప్రజాగళం’సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ఈ జిల్లాలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు నానిలు ఉన్నారు. వారు మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. బందరు అభివృద్ధికి ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా?’’అని ప్రశ్నించారు. బందరు నగరానికి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత తమదేనని చంద్రబాబు అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు