బ్రేకింగ్

breaking
10 May 2024 | 18:23 IST

జూన్‌ 4 తర్వాత వారంతా పారిపోక తప్పదు: మోదీ

హైదరాబాద్‌: జూన్‌ 4 తర్వాత ఉమ్మడి పౌరస్మృతి విరోధులు, ఆర్టిక్‌ 370 రద్దు వ్యతిరేకులు పారిపోక తప్పదని ప్రధాని మోదీ అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘‘ మధ్య తరగతి ప్రజల కలలను భాజపా సర్కార్‌ నెరవేరుస్తోంది. గత పదేళ్లలో ఎన్నో సమస్యలకు ఎన్డీయే సర్కార్‌ పరిష్కారం చూపింది. డిజిటల్‌ రంగంలో, అంకుర సంస్థల్లో నేడు భారత్‌ సూపర్‌ పవర్‌. దేశాన్ని లూటీ చేయడం, వారసత్వ రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్‌ది ట్రాక్‌ రికార్డు. దేశాన్ని విభజించి పాలించాలనేది ఆ పార్టీ కుట్ర ’’ అని మోదీ విమర్శించారు.

మరిన్ని

తాజా వార్తలు