బ్రేకింగ్

breaking
10 May 2024 | 19:02 IST

గుజరాత్‌తో మ్యాచ్‌.. చెన్నై బౌలింగ్‌

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌-17లో భాగంగా చెన్నై, గుజరాత్‌ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన చెన్నై బౌలింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడగా.. 4 విజయాలతో గుజరాత్‌ అట్టడుగు స్థానంలో ఉంది. ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొందిన చెన్నై ప్లే ఆఫ్‌ అవకాశాలను మెరుగుపరచుకోవాలని ప్రయత్నిస్తోంది. చెన్నై కింగ్స్‌: గైక్వాడ్‌, రవీంద్ర, మిచెల్‌, దుబే, మొయిన్‌, జడేజా, ధోని, శాట్నర్‌, శార్ధూల్‌, తుషార్‌, సిమర్జీత్‌. గుజరాత్‌ జట్టు: శుభ్‌మన్‌, సాయి సుదర్శన్‌, షారూఖ్‌, మిల్లర్‌, మాథ్యూ, తెవాటియా, రషీద్‌, నూర్‌ అహ్మద్‌, ఉమేశ్‌, మోహిత్‌, త్యాగి.

మరిన్ని

తాజా వార్తలు