బ్రేకింగ్

breaking
24 Jan 2022 | 15:20 IST

ఉద్యోగుల నిర్ణయాలు చెబితేనే కదా తెలిసేది: సజ్జల

అమరావతి: పీఆర్సీపై చర్చలకు రావాలని ఉద్యోగులను పిలిచామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనన్నారు. ‘‘సమ్మె నోటీసు ఇచ్చాక కూడా చర్చలకు ఆస్కారం ఉంది. మా దగ్గరకు వచ్చి మాట్లాడితేనే వారి సమస్యలు తెలుస్తాయి. ఎప్పుడైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేది ప్రభుత్వమే. కమిటీ, పీఆర్సీ జీవోలపై చాలా మంది మాట్లాడుతున్నారు. ఉద్యోగ సంఘాల నిర్ణయాలు ఏమిటో చెబితేనే కదా మాకు తెలిసేది’’ అని సజ్జల అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు