బ్రేకింగ్

breaking
27 Apr 2024 | 18:12 IST

జగన్‌ నవరత్నాలు.. నవమోసాలయ్యాయ్‌: చంద్రబాబు

ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం రాగానే అంగన్‌వాడీలు, హోంగార్డులు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. జగన్‌ నవరత్నాలు.. నవమోసాలు అయ్యాయని ఎద్దేవా చేశారు. ‘‘ గులకరాయితో హత్యాయత్నం చేశానని నాపై నింద వేశారు. కోడి కత్తి కేసులోనూ ఇలాంటి ఆరోపణలే చేశారు. బ్యాండేజ్‌  తీయకుండా డ్రామాలు చేద్దామని జగన్‌ అనుకున్నారు. అందరూ హేళన చేయడంతో ఇవాళ బ్యాండేజ్‌ తీశారు. గాయం కపడిందా?’’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని