బ్రేకింగ్

breaking
16 Apr 2024 | 13:19 IST

శిరోముండనం కేసు.. వైకాపా ఎమ్మెల్సీకి జైలు శిక్ష

విశాఖ: శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు 18 నెలల జైలు శిక్ష విధిస్తూ విశాఖ కోర్టు తీర్పునిచ్చింది. జైలు శిక్షతో పాటు రూ.2.50 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో 28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. 1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు.

మరిన్ని

తాజా వార్తలు